గద్వాల, డిసెంబర్ 7 : రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో వరినారు ఎదగక పంటకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చునని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. గత వర్షాకాల పంటలకంటే యాసంగిలో రైతులు వరిపంటను అధికంగా సాగు చేసే అవకాశమున్నందున వరి పంటలను సాగుచేసే రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన రసీదును భద్రపర్చుకోవాలి. విత్తనాలు మొలకెత్తే సమయంలో సమస్యలు వస్తే దుకాణదారుపై చర్యలు తీసుకోచ్చు.
నారుమడిలో రక్షణ చర్యలు..
రసాయనాలతో విత్తన శుద్ధి..
సేంద్రియ పద్ధతిలో విత్తన శుద్ధి..
నాటువేసే సమయంలో..
చలినుంచి కాపాడేందుకు..
జాగ్రత్తలు పాటించాలి..
యాసంగిలో ముఖ్యంగా వరినార్లు వేసుకునే రైతులు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుగా వ్యవసాయాధికారులను ఆశ్రయించి సరైన జాగ్రత్తలు పాటించాలి. మొలకెత్తే దశలోనే తెగుళ్లు సోకే అవకాశమున్నందున రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి.
– శంకర్లాల్, ఏవో, అయిజ