గులాబీ సేన గర్జించింది. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేని కేంద్రం తీరును ఎండగడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతన్నలు కదిలిరాగా.. బీఆర్ఎస్ సేన.. బీజేపీ సర్కార్పై కన్నెర్ర చేసింది. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జయహో కేసీఆర్.. బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినదించారు. ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలతో జిల్లా కేంద్రాలు గులాబీమయంగా మారాయి. ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, గువ్వల, రాజేందర్రెడ్డి, బండ్ల, ఆల, అబ్రహం, చిట్టెం, బీరంతోపాటు వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఉపాధి నిధులతో చట్టబద్ధంగా రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే మోదీ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు.
– నెట్వర్క్ నమస్తే తెలంగాణ, డిసెంబర్ 23
మహబూబ్నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహాధర్నా విజయవంతమైంది. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మహబూబ్నగ ర్, నారాయణపేట, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేం ద్రంలో ధర్నా అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగర్కర్నూల్లో పార్టీ అధ్యక్షుడు, విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణచౌక్లో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వనపర్తి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్చౌక్లో ఆందోళన చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆధ్వర్యంలో ధాన్యం ఆరబోసి నిరసన తె లిపారు.
మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాజీలేని పో రాటం చేస్తామని ప్రతీనబూనారు. బేషరతుగా ఆ ని ర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆది నుంచి ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చాలని కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు. మిగతా రాష్ర్టాలకు షరతులు విధించని కేంద్ర సర్కారు కేవలం తెలంగాణపైనే ఆంక్షలు పెడుతున్నదని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు వ్య వసాయ కల్లాలను నిర్మించుకోవడం చూసి కేం ద్రం ఓర్వడంలేదన్నారు. డబ్బును తిరిగి వాపస్ చేయాలని ఇచ్చిన నోటీసు ప్రజాస్వామ్య విధానాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజును చేస్తుంటే కేంద్రం దిగజార్చాలని చూస్తున్నదన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖం డిస్తుండడం, బీఆర్ఎస్ స్థాపించడాన్ని చూసి కండ్ల మంటతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.
రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించిన ఏడాది తర్వాత నల్లచట్టాలను వాపస్ తీసుకున్న కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిందన్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ పిలుపుతో దేశ వ్యాప్తంగా రైతులు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేస్తారన్నారు. ‘చేపల కల్లాలకు నిధులు ఇస్తరెట్ల? రై తు కల్లాలకు ఇయ్యరెట్ల? అని మోదీ సర్కార్ను ప్రశ్నించా రు. కేంద్రం తీసుకొనే ప్ర తీ నిర్ణయం రై తు వ్యతిరేకమేనని, వ్య వసాయంపై కనీస అ వగాహన లేని ప్రధాని, కేం ద్ర మంత్రులు దేశాన్ని పాలిస్తుండ డం మన దౌర్భాగ్యమన్నారు. రైతులకు మేలు చేకుర్చే ప్రభుత్వాలు కావాలా.. కార్పొరేట్లకు కొమ్ముకాసే సర్కార్ కావాలా అని తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కార్పొరేట్ కంపెనీలకు రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతులకు రూ.లక్షకోట్ల రుణాలు కూడా మాఫీ చేయడంలేదెందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏండ్లుగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో మోదీ విధానాలను వ్యతిరేకించే ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ అని.. అందుకే తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.