నాగర్కర్నూల్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంపై సర్కారు దూరదృష్టి కొరవడింది. యా సంగి సాగుపై ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో పంటల విస్తీర్ణం సగానికి తగ్గగా.. రైతన్నలు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. ఎంజీకేఎల్ఐ నీళ్లు నిలిచిపోవ డం, భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి సా గు పడిపోయింది. దీంతో రాబోయే కాలంలో ‘సాగుబడి’ దిగుబడిగా కాకుండా దిగాలుగా మారుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో కేసీఆర్ సర్కారు హయాం లో సంబురంగా మారిన సేద్యం.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో సన్నగిల్లుతున్నది. ప్రస్తుతం సాగుపై సర్కారు చిత్తశుద్ధి కొరవడడంతో యాసంగి విస్తీర్ణం తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతి వానకాలం, యాసంగిలోనూ సాగుబడి పెరుగుతూ వచ్చిం ది. కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐ ని పూర్తి చేయడంతో 2016లో 1.30 లక్షల ఎకరాలు న్న సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు చేరింది. ఎంజీకేఎల్ఐని పూర్తి చేయడంతో జొన్నలబొగుడ, సిం గోటం, గుడిపల్లి రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చా యి. ఇక్కడి నుంచి నీటిని జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి మళ్లించారు. ఇలా ఏడాదికి రెండు పంటలకు కలి పి జిల్లాలో దాదాపు 9 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టడం గమనార్హం. ఈ క్రమంలో సమైక్య పాలనలో బీళ్లుగా ఉన్న భూములు పచ్చని పంటలతో మాగాణులుగా మారాయి. నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో చాలా భూములు కంపచెట్లు, చెరువుల సమీపంలో సర్కారు తుమ్మ, లొట్టపీసు చెట్లు, తం గేడు చెట్లతో బీళ్లుగా, చిన్న అడవులను తలపించే వి. గడిచిన పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంపై ముందుచూపుతో పంటల సీజన్కు ముందే ఎంజీకేఎల్ఐ ద్వారా నీళ్లను చెరువుల్లోకి ఎత్తిపోశారు.
దీంతో రైతులు ముందస్తు గా వరి నారు సిద్ధం చేసుకోవడం, దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యేవారు. అప్పటికే ఎరువులు కూడా అందుబాటులో ఉంచడంతో సాగు సంబురంగా జరిగేది. గత అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో యాసంగి సాగుపై చిత్తశుద్ధి కరువైంది. సాగుకు సిద్ధమైన రైతులను సర్కారు పట్టించుకోకుండా ఆరుగ్యారెంటీలు, ఇతర రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతూ వస్తున్నది. ఈక్రమంలో ఎంజీకేఎల్ఐ నుంచి నీటి విడుదలను విస్మరించడంతో చెరువుల్లో నీళ్లు తగ్గాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రైతాంగం యాసంగి సాగును బాగా తగ్గించుకున్నారు. జిల్లాలో 2022 యాసంగిలో 3,12,096 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. 2023 సీజన్లో 3,15,919 ఎకరాల్లో సాగు జరుగుతుందని ఊహించ గా 2,30,893 ఎకరాలకే పరిమితమైనట్లు అధికారులు అంచనా వేశారు. దాదాపు లక్ష ఎకరాల విస్తీర్ణం తగ్గడం గమనార్హం. పంటలు చేతికొచ్చే సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాలి. కాగా, గత వానకాలంలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాల ద్వారా స్వీకరించకుండా వ్యాపారులకు విక్రయించింది. ఈసారి కూడా అదే జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. ఫలితంగా వ్యవసాయంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
నాకు రెండెకరాల పొలం ఉంది. బోరు ద్వా రా వ్యవసాయం చేసుకుంటున్న. ఇప్పుడు బోరు లో నీళ్లు బాగా తగ్గినయ్. డిసెంబర్ నుంచే నీళ్లు తగ్గడంతో సాగు చేయడం కష్టమనిపించింది. ప్ర తిసారి రెండెకరాల్లో వరి పంట సాగు చేస్తుంటి. బోరు నుంచి నీళ్లు గుక్కబట్టి వస్తున్నయ్. నష్టం వస్తుందని అర్థమై ఈసారి పంట వేయలేదు. ప్రా జెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తలేరు కాబట్టి బో రులో నీళ్లు తగ్గినయ్. పోయిన ఏడాది ఎండాకా లం కూడా బోరు ఫుల్లుగా పోసింది. ఈసారి డిసెంబర్ నుంచే నీళ్లు తగ్గినయ్. మార్చి, ఏప్రిల్ లో చుక్క నీరు కూడా వచ్చేటట్టు లేదు. ఇలాగే ఉంటే వ్యవసాయం చేయడం కష్టమైతది.