అచ్చంపేట రూరల్, ఫిబ్రవరి 8 : అచ్చంపేట మార్కెట్లో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం ఆందోళన నిర్వహించిన విషయం విధితమే. గురువారం మార్కెట్ చైర్పర్స న్ అరుణ, మార్కెట్ కార్యదర్శి నర్సింహులు, ట్రే డర్లు, వ్యాపారులు, రైతులతో చర్చించి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీం తో గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలు సజావుగా సాగాయి.
వేరుశనగకు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ధర పలికిన రైతులకు రూ.250 పెంచారు. అలాగే రూ.6,001 నుంచి రూ.6,400 మధ్య ధర ఉన్న రైతులకు రూ.125, రూ.6,401 నుంచి రూ.7 వేల మధ్య రేటు ఉన్న రైతులకు రూ.50 పెంచినట్లు మార్కెట్ కార్యదర్శి నర్సింహులు తెలిపారు. రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు ఫలించడంతో వేరుశనగ రాశులను తూ కాలు చేసి కొనుగోలు చేసిన ట్రేడర్లు తమ మిల్లుల కు తరలించారు.