నెర్రెలుబారిన నేలలో కృష్ణమ్మ జలతాండవం చేస్తున్నది. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మారి సాగునీటి పండుగను తీసుకొచ్చారు. ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి కృష్ణమ్మను పరుగులు పెట్టించారు. ఎంజీకేఎల్ఐ పరిధిలో రోజుకు 4 వేల క్యూసెక్కులను లిఫ్ట్ చేస్తుండగా.. 4 టీఎంసీల సా మర్థ్యంతో మూడు రిజర్వాయర్లు నిర్మించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి రో జుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే సామర్థ్యంగల మోటర్లను బిగించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 67 టీ ఎంసీల సామర్థ్యం గల ఐదు రిజర్వాయర్లను నిర్మించారు. దీంతో సాగునీరు పుష్కలమైంది. బీడు భూములకు జలహారం సంతరించుకోవడంతో సిరుల పంటలు పండుతున్నాయి. 40 వేల ఎకరా ల్లో వరి, 35 వేల ఎకరాల్లో మామిడి, 3 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతుండగా.. కొల్లాపూర్ రూపురేఖలు మారిపోయాయి. వలసలు తగ్గి వ్యవసాయంతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దీంతో వారి మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 19
కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 19: పాలమూరు అంటేనే వలసలకు నిలయం. అందులో కొల్లాపూర్ కూడా కరువు కటకాలతో నిత్యం వలసలకు కేంద్రబిందువుగా ఉండేది. అలాంటి పట్టణం నే డు అభివృద్ధికి కేరాఫ్గా మారింది. తిండి కోసం పరాయి దేశాలకు పయనమైన కొల్లాపూర్లో నేడు ఇతరులకు బతుకుదెరువు లభిస్తున్నది. బీడువారిన భూమిలో నేడు కృష్ణమ్మ పరుగులు పెట్టనున్నది. పాడి పంటలతో దేశవిదేశాలకు పంటలను ఎగుమతి చేస్తూ ప్రపంచానికి కొల్లాపూర్ మామిడి తీయదనాన్ని పరిచయం చేస్తోం ది. కొల్లాపూర్లో రాళ్లూరప్పలు తప్పా ఏమీ లేవన్న వారు నేడు టూరిజం సొబగులను చూసి మైమర్చిపోతున్నారు. 1972లో క రువు రక్కసికి బలి అయిన కొల్లాపూర్ నేడు వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ సుభిక్షంగా ఉన్నది. తెలంగాణ ఏర్పాటుతో కొల్లాపూ ర్ దశ, దిశ మారిపోయింది. కరువును జయించిన నేలగా కొల్లాపూర్ చరిత్రలో నిలిచిపోయింది.
కొల్లాపూర్ వలసలను జయించింది. ఇక్కడి నుంచి రాయలసీమ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, దుబాయ్ వంటి ప్రదేశాలకు అధికంగా వలస వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ పనులు పెరగడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడంతో వలసలు ఆగిపోగా వెళ్లిన వారు తిరిగొచ్చారు. స్థానికంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో స్థానికులకు ఉపాధి దక్కడంతోపాటు బయటి రాష్ర్టాల నుంచి వ చ్చిన కార్మికులకు కొల్లాపూర్ ‘ఉపాధి కేంద్రం’గా మారింది.
కృష్ణమ్మ చెంతనే ఉన్నా కొల్లాపూర్కు సాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా కొల్లాపూర్ దశాబ్దాలపాటు మూల్యం చెల్లించుకున్నది. కానీ ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొల్లాపూర్లో సాగునీటి కష్టాలు కనుమరుగయ్యాయి. కృష్ణానదిలో నీటి లెక్కలు అడగడంతో కొల్లాపూర్ తలరాత మారింది. మూలన పడిన ప్రాజెక్టులకూ మోక్షం లభించింది. నత్తనడకన సాగే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టా యి. నేడు కొల్లాపూర్ సాగరవనంగా మారింది. కొల్లాపూర్ ప్రాం తంలో అతి ముఖ్యమైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పీఆర్ఎల్ఐ ప్రా జెక్టులున్నాయి. శ్రీశైలం డెడ్ స్టోరేజీ ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని డ్రా చేయవచ్చు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు కింద ఉన్న మూడు రిజర్వాయర్లు నాలుగు టీఎంసీల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. పీఆర్ఎల్ఐకి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఐదు రిజర్వాయర్లు 67 టీఎంసీల నీటిని నిల్వచేయొచ్చు. ఎలాంటి వర్షాభావ పరిస్థితుల్లోనైనా కొల్లాపూర్కు సాగునీటి కష్టాలు ఉండవు.
బీడువారిన పొలాలకు కృష్ణమ్మ పరవళ్లు తోడవడంతో కొల్లాపూర్లో వరిసిరులు పండుతున్నాయి. 35వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. దొడ్డు బియ్యం ఎరుగని పల్లెలు నేడు సన్న బియ్యాన్ని పండిస్తూ పట్టణాలకు ఎగుమతి చేస్తున్నాయి. కేఎల్ఐ ప్రధాన కాల్వతోపాటు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు, పిల్లకాల్వల ద్వారా వరిని సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటలతోపాటు, ఆయిల్ పాం సాగు కూడా భారీగా పెరిగింది. కొల్లాపూర్ ప్రాంతంలో నీటి కొరతతో బీడువారిన భూములు కనిపించడం లేదు. పాడి పంటలతో కొల్లాపూర్ ప్రాంతంలోని పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాలయ్యాక కొల్లాపూర్ కరువును జయించింది. సాగునీరు అందడంతో పట్నం పాడి పంటలకు నిలయంగా మారింది. సింగోటం చెరువు ఒక్కసారి నిండితే ఏడేండ్లు కరువు వచ్చినా పంటలు సాగు చేసేటోళ్లం. ఇప్పుటి వరకు సింగోటం చెరువు ఏండిన జాడ లేదు. ఇప్పుడు మా ప్రాంతంలో కరువు ఊసే లేదు. 1972లో కరువు రావడంతో బతుకుదెరువు కోసం దేశం పోయాం. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నా కరువు ఛాయలు కనబడుత లేవు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నదాతకు సర్కారు రైతుబంధు అందిస్తూ వారిని అప్పుల ఊబి నుంచి కాపాడింది. పుష్కలంగా సాగునీరు, పంటల పెట్టుబడికి ఆర్థికసాయం, నిరంతరం నాణ్యమైన కరెంటుతో సాగు సంబురమైంది. కొల్లాపూర్లో మామిడి దిగుబడి పెరగడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మామిడి మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొల్లాపూర్ కరువు వీడి కర్షక రాజ్యంగా నిలిచింది.