వడ్డేపల్లి, జనవరి 8 : బొమ్మలంటే అతడికి ప్రాణం.. పెన్సిల్ చేతబట్టాడంటే చాలు ఎన్నో చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నాడు.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన యువకుడు ఉమామహేశ్. కేవలం పెన్సిల్, పెన్నులతో తన చేతి నుంచి అద్భుత కళాఖండాలను సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఎన్నో పేజీలు చదివితే కానీ అర్థంకాని విష యం ఒక్క బొమ్మతో అర్థమయ్యేలా చేయడంలో అతడికి మరెవరూ సాటిరారు. సెల్ఫోన్ కు బానిసవుతున్న నేటి విద్యార్థులు పుస్తకాలకు తాళం వేస్తున్నట్లు తెలిపే చిత్రం, కరోనా సమయంలో మనం ఎదుర్కొన్న సమస్యలపై, తెలంగాణ ఉద్యమ, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఎన్నెన్నో అద్భుత చిత్రాలను, కళాఖండాలను, క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి సెలబ్రిటిల చిత్రాలను అవలీలగా వేయడమంటే అతడికి ఎంతో మక్కువ.
యువకుడు వేసిన చిత్రాలను చూసి ఎంతటి వారై నా మంత్రముగ్ధులు కావాలవాల్సిందే.. అతడిలోని నైపుణ్యాన్ని గ్రా మంలోని చిన్నారులకు సైతం నేర్పిస్తున్నాడు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో, వివిధ కళల్లో నైపు ణ్యం సాధించే లక్ష్యంతో అడుగులు వేయాలని కోరాడు. అయితే ఈ మధ్యే కా నిస్టేబుల్ ఉద్యోగం సా ధించానని, విధుల్లో చేరాల్సి ఉన్నదని ఆ యువకుడు తెలిపా డు. ఇతడి ప్రతిభను పలు వురు ప్రశంసిస్తున్నారు.