మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 27 : మహబూబ్నగర్లోని బండమీదిపల్లి వద్ద ఉన్న వైన్స్షాపులో బీరు కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో శ్రీకాంత్యాదవ్ను హత్య చేసిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారా? లేక కావాలనే పోలీసు లు అరెస్ట్ చేయడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిదిమందిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ఇద్దరిని అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. అధికార పార్టీకి చెందిన నేత ఆదేశాలతోనే పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చే యడం లేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న ఇద్దరిలో ఒకరు మున్సిపల్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఏ10గా ఉన్న వ్యక్తికి రాజకీయ అండదండ ఉండడంతోనే అరెస్ట్ చేయడం లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది.
ఈ హత్య కేసును మొదట్లో పోలీసులు తాత్సా రం చేశారు. ప్రజాసంఘాలు, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఆందోళనలు, ధర్నాలు, ‘నమ స్తే తెలంగాణ’ కథనానికి స్పందించి పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో మద్యం మాఫియా దాడి చేయడంపై పలు విమర్శలొచ్చాయి. వైన్స్షాపు వారిని రక్షించేందుకు ఓ నాయకుడు ప్రయత్నించారన్న ఆరోపణలూ ఉ న్నాయి. పరారీలో ఉన్న వారిని అరెస్టు చేయడంలో పోలీసుల అలసత్వం కారణంగా వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయాలని యాదవసంఘం నాయకుడు శ్రీనివాస్, చందుయాదవ్, ముదిరాజ్ యువజన నాయకుడు రాకేశ్తోపాటు పలువురు కోరుతున్నారు.