భూత్పూర్, డిసెంబర్ 25 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్తూర్ సురేశ్గౌడ్ అన్నారు. భూత్పూర్ చౌరస్తాలో ఆదివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సిద్ధాయపల్లిలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సిద్ధాయపల్లిలో నిర్మించిన ఇండ్లను పేదలకు పంపిణీ చేయడాన్ని జీర్ణించుకోలేక కుటీల రాజకీయా లు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్యగౌడ్, రాకేశ్, వెంకటేశ్, యూత్ విభాగం నాయకులు రాము లు, గడ్డం ప్రేమ్కుమార్, శివ, భీమస్వామి, ఖదీర్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.