లింగాల, మార్చి 12 : బ్లాస్టింగ్ పూస పేలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లవెల్లి జయలక్ష్మి, సవారి కుమారుడైన ధనుష్ ఆరుబయట ఆడుకుంటుండగా పేలుడు పదార్థం దొరికింది.
దానికి ఉన్న రెండు కొనలను కరెంట్ బోర్డులో పెట్టగా పేలు డు సంభవించింది. అయితే, కరెంట్ పోవడంతో బా లుడు గాయపడగా.. జిల్లా కేంద్రంలోని దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు డాగ్ స్క్వా డ్ సాయంతో ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు.