మహబూబ్నగర్ టౌన్, మార్చి 31 : మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జిల్లాస్థాయి కిక్బాక్సింగ్ పోటీలను ప్రిన్సిపాల్ శాంత ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని.. క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ కిక్బాక్సింగ్లో క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. పోటీల్లో 50మంది క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ రవినాయక్, సలహాదారుడు విజయ్కుమార్తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.