హన్వాడ, మే 18 : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడాశాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని యారోనిపల్లిలో రూ.22లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మాదారంలో రూ.20లక్షలు, మునిమోక్షంలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే మునిమోక్షంలో రూ.కోటి 4లక్షలతో వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 75ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీలు అభివృద్ధిని మరిచి నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిస్సిగ్గుగా లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణను పోగొట్టలేరని స్పష్టం చేశారు. తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచులు రాములమ్మ, ర్యాకమయ్య, సుధ, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీలు వడ్ల శేఖర్, సోనిబాయి, భాగ్యమ్మ, రైతుబంధు సమితి కన్వీనర్ రాజుయాదవ్, నాయకులు నరేందర్, చెన్నయ్య, హరిచందర్, రామలింగం, కొండ లక్ష్మయ్య, బాలయ్య, రమణారెడ్డి, అనంతరెడ్డి, రామంజీ, పాపయ్య, మోహన్, మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నర్సింహులు, శ్రీనివాసులు, రఘుతో పాటు దివ్యాంగుల సంఘం మండల నాయకులు మొత్తం 50మంది మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశామని, రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అందరూ కలిసిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.