మహబూబ్నగర్, ఆగస్టు 24 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొంది, వినియోగించుకోవాల్సిన అవశ్యకత ప్రతి ఓటరుపై ఉంది. ఓటుతో తన తలరాతను మార్చడంతోపాటు దేశ భవిష్యత్ను మార్చే శక్తి ఉంది. మెరుగైన సమాజం నిర్మాణానికి ప్రతి ఓటరు చేతిలో అరుదైన ఆయుధం ఓటు. అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు అర్హులు. ఓటరు పేరు, ప్రాంతాల మార్పులతోపాటు ఈ ఏడాది అక్టోబర్1వ తేదీలోగా 18 ఏండ్లు నిండిన వారందరూ అర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటి వరకు 18 ఏండ్లు నిం డిన వారు అర్హులుగా పరిగణిస్తూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూ చిస్తుంది.
ప్రత్యేక క్యాంపులు
ఓటరు సవరణ, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రజల దరికి చేర్చేందుకుగానూ అధికార యంత్రాంగం ఈ నెల 26, 27తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నది. సెప్టెంబర్ 28వ తేదీలోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్ 4వ తేదీన తుది జాబితాను ప్రకటించిందుకుగానూ ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకుగానూ ఇప్పటికే ప్రచార రథాలు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే.
అర్హులు నమోదు, సవరణలు చేసుకోవాలి
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కు ను పొందేందుకుగానూ అర్హులంద రూ ఓటరు గా నమోదు చేయించుకోవాలి. ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీలోగా 18 ఏండ్లు నిండిన వారంద రూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచిస్తున్నది. ఈ నెల 26, 27 తేదీలతోపాటు వచ్చే నెల 3,4 తేదీల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నాం. అర్హులైన వారు అందరూ సవరణలు, ఓటరు నమోదు చేసుకోవాలి.
-జీ. రవినాయక్ కలెక్టర్, మహబూబ్నగర్