ఆ ప్రాంతంలో దశాబ్దాల క్రితం రైల్వే స్టేషన్ ఏర్పాటైంది.. ఆ స్టేషన్గుండా ప్రతి రోజూ తిరుపతి, బెంగళూర్, చెన్నై, మైసూ ర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రాక పోక లు సాగిస్తుంటాయి కానీ.. ఈ ప్రాంత ప్రజలు ఆయా ప్రాంతాలకు రైళ్లల్లో ప్రయా ణించాలంటే ముందుగా 22 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాల్సిందే…
దేవరక్రద రైల్వేస్టేషన్లో కేవలం నాలుగు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగడంతో తాము తిరుపతి వంటి పుణ్యక్షేత్రం, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేషన్ గూండా ప్రతి రోజూ బెంగళూర్, చెన్నై, తిరుపతి, మైసూర్ తదితర ప్రాంతాలకు పదుల సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్లుతున్నా ఇక్కడ ఆపడం లేదు. కేవలం గుంటూర్ ప్యాసింజర్, రాయిచూర్ డెమో , కర్నూల్ ప్యాసింజర్, గుంతకల్ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. దీంతో దేవరకద్ర నియోజకవర్గంతో పాటు నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట, మరికల్ తదితర ప్రాంతాలవాసులు ప్రతి రోజూ తిరుపతి, బెంగళూర్, చెన్నై, ఢిల్లీ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు.
దేవరకద్ర రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్స్ రైళ్లు నిలపకపోవడంతో 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్నగర్ స్టేషన్కు బస్సులో వెళ్లి ఎక్కాల్సి వస్తోందంటున్నారు. తిరుగు ప్రయాణంలో రాత్రి సమయంలో వస్తే మహబూబ్నగర్లో బస్సులు లేక ఉదయం వరకు బస్టాండ్లో నరకయాతన అనుభవించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవస్థలు దృష్టిలో ఉంచుకొని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు ఢిల్లీ స్థాయిలో రైల్వే అధికారులకు వినతి ప్రతాలు అందజేసినా వారు స్పందించడం లేదంటున్నారు. వారం రోజుల కిందట మహబుబ్నగర్ రైల్వే స్టేషన్ను సందర్శించేందుకు వచ్చిన రైల్వే జనరల్ మేనేజర్కు దేవరకద్ర ఎంపీపీ రమా శ్రీకాంత్యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మండల బీఆర్ఎస్ నాయకులు దేవరకద్ర స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని వినతి పత్రం అందజేశారు. ఇప్పుడైనా రైల్వే అధికారులు స్పందించి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపి ఈ ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని వారు కోరుతున్నారు.