నారాయణపేట రూరల్, అక్టోబర్ 8 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్నివిధాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు పథకం అందజేస్తున్నారన్నారు. అన్ని మతాల వారికి ప్రాధాన్యతను ఇస్తూ కానుకలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇంటి నిర్మాణాల కోసం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. అనంతరం బండగొండలో రూ.15లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, పాఠశాల భవనాన్ని ప్రారంభించా రు. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అలాగే అభంగాపూర్లో పార్టీ జెండా ఆవిష్కరించి నూతన గ్రామపంచాయ తీ భవనం ప్రారంభించారు. తిర్మలాపూర్లో పార్టీ జెండావిష్కరణ, బస్టాండ్ ప్రారంభోత్స వం, మహిళా సంఘం భవనం ప్రారంభోత్సవం చేశారు. మోకహనుమాన్తండాలో పార్టీ జెండాఆవిష్కరణ, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. కోటకొండలో పార్టీ జెండావిష్కరణ, రూ.15లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమ్మిరెడ్డిపల్లిలో పార్టీ జెండావిష్కరణ చేశారు. అప్పక్పల్లిలో పార్టీ జెండావిష్కరణ, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. చిన్నజట్రంలో పార్టీ జెండావిష్కరణ, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. లక్ష్మీపూర్లో పార్టీ జెండావిష్కరణ, వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ.18లక్షలతో కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. బోయిన్పల్లి, అంత్వార్,కొల్లంపల్లి, వందర్గుట్టతండాలో పార్టీ జెండాఆవిష్కరణ, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. లింగంపల్లి, పిల్లిగుండ్లతండాలో పార్టీ జెండావిష్కరణ, నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ తాజుద్దీన్, మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, మండలాధ్యక్షుడు రాములు, కార్యదర్శి రవీందర్గౌడ్, యూత్ అధ్యక్షుడు మోహన్నాయక్, నాయకులు మధుసూదన్రెడ్డి, ఆంజనేయులు, స్వప్న, పుష్పలత, శేఖర్ పాల్గొన్నారు.