వనపర్తి టౌన్, జనవరి 24: ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో సాహి తీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు ఆదర్శంగా విధులు నిర్వర్తించినప్పుడే అభిమానాన్ని పొందుతారని, రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. నేటితరం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు భావితరాలకు ఉండవని, మన జీవన విధానం వారికి మార్గదర్శకం చేస్తుందని వివరించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల్లోని ఆంశాలే కాకుండా పాఠ్యేతర ఆంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎంవో, సెక్టోరియల్ అధికారులుగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్, గణేశ్కుమార్ను శాలువా, జ్ఞాపికతో అభినందించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయుల డైరీ, క్యాలెండర్ను మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, మాజీ డీఈవో విజయ్కుమార్, ఎంఈవో శ్రీనివాస్గౌడ్, కళావేదిక సభ్యులు నారాయణరెడ్డి, బైరోజు చంద్రశేఖర్, రాములు, వివిధ సంఘాల నాయకులు బౌద్దారెడ్డి, వరప్రసాదరావు, మహిపాల్రెడ్డి, విజయ్, రవిప్రసాద్గౌడ్, అనురాధ, శంకరయ్య, తారాబాయి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.