నాగర్ కర్నూల్ : వరుసగా కురుస్తున్న ముసరు వర్షాలకు నాగర్కర్నూల్ జిల్లాలోని దుందుభి వాగు (Dundubhi vagu ) ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు ( Oldman ) వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.
తెలకపల్లి మండలం (Telakapalli Mandal) గౌరారం గ్రామానికి చెందిన కురువ సొంటె పెద్ద జంగయ్య (65) వంగూర్ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో ఉండే కుమార్తె వద్దకు వెళ్లేందుకు వాగు దాటుతున్న క్రమంలో కాలుజారి వాగులో గల్లంతయ్యాడు. స్థానికులు గుర్తించి వెంటనే కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.