నారాయణపేట, జనవరి 7 : కోర్టు అధికారులు, మెడిక ల్ శాఖ, ఎఫ్ఎస్ఎల్ శాఖ అధికారులతో పోలీసు అధికారు లు సమన్వయంతో పనిచేసి కోర్టులో చార్జీషీట్ వేసిన ప్రతి కేసులో శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలని ఎస్పీ వెం కటేశ్వర్లు ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్స్టే షన్లలో నమోదు అయినప్పటి నుంచి కోర్టుల్లో చార్జీషీట్ అ యినా కేసుల్లో జరిగే పొరపాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తల పై శనివారం చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల్లో శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని, నేరాలు చేయాలంటే భయం కలుగుతుందని తెలిపారు.
కేసులను పకడ్బందీగా దర్యాప్తు చేసి సరైన సాక్ష్యాదారాలు సమర్పించి శిక్షలు పడేలా చూడడంతో నేరాలను నియంత్రించవచ్చన్నారు. సాక్షుల వివరాలు నేరస్తుల కు షేర్ చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. సాక్షులు, ముద్దాయిలు కోర్టుకు హాజరయ్యే లా చూసుకోవాలని కోర్టు డ్యూటీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్ బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏపీపీ అభిన య్, సీఐలు రవిబాబు, జనార్దన్, ఎస్సైలు సురేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మికులు కనపడితే డయల్ 100కు సమాచారమివ్వాలి
బాలకార్మికులు కనపడితే డయల్ 100కు సమాచారమి వ్వాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని పలు మెకానిక్ షాపులు, హాటళ్లు, కిరాణం షాపులు, వె ల్డింగ్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆపరేషన్ స్మైల్ 9 బృందం సభ్యులు శనివారం దాడులు నిర్వహించి 12 మం ది బాలకార్మికులను పట్టుకొని సీడబ్ల్యూసీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడుల్లో పట్టుకున్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బాలలను పనిలో పె ట్టుకున్న వారికి జరిమానా విధించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.