మహబూబ్నగర్, నవంబర్ 26 : మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఓటు ఎంతో కీలకం. దేశ భవిష్యత్తు ఓటర్ చేతిలోనే ఉంటుంది. ఈ క్ర మంలో అర్హులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తున్నది. ఇందుకుగానూ అధికారులు యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకుగానూ జనవరి 1, 2023 లోపు 18 ఏండ్లు నిండిన వారంద రూ అర్హులుగా పరిగణిస్తున్నారు.
తల్లిదండ్రులు కూడా 18 ఏండ్లు నిండిన వారిని ఓటర్గా నమోదు చేయించాలి. ప్రతి పోలింగ్స్టేషన్ లాటిట్యూడ్లను తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించా రు. ప్రతి సూపర్వైజర్ పరిధిలో కనీసం 10 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. పీఎస్సీడీఎస్సీ, లాజికల్ ఎర్రర్స్ జాబితాను ఇంటింటికీ తి రిగి పరిశీలించిన అనంతరం సూపర్వైజర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల సవర ణ, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను ప్ర జలందరి చేర్చేందుకుగానూ అధికారులు ఈ నెల 26, 27 తేదీలతోపాటు డిసెంబర్ 3, 4వ తేదీ ల్లో ప్రచారం చేయనున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ నియోజకవర్గంలో 1,16,769 మంది పురుషులు, 1,16,558 మంది స్త్రీలు, ఇతరులు పది మంది ఉన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో 1,02,029 మంది పురుషులు, 1,00,331 మంది స్త్రీలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 1,07,095 మంది పురుషులు, 1,08,218 మంది స్త్రీలు ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,25,893 మంది పురుషులు, 3,25,107 మంది స్త్రీలు, ఇతరులు 12 మంది ఉన్నారు.