రైస్ మిల్లింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇంకా అందించకపోవడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 2020-21 యాసంగిలో జిల్లాలోని మిల్లులకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా.. సీఎమ్మార్ కింద 1.82 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి. కానీ సగానికిపైగా మిల్లర్లు అందించలేదు. అలాగే 2021-22 వానకాలం సీజన్లో మిల్లులకు 2.44 లక్షల మెట్రిక్ టన్నులు అందించగా 1.19 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి. పెద్ద మొత్తంలో రావాల్సి ఉన్నా మిల్లర్లు జాప్యం చేస్తుండడంతో జిల్లా పౌరసరఫరాల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే రీసైక్లింగ్ నియంత్రణకూ టాస్క్ఫోర్స్ను రంగంలోకి దించనున్నది.
వనపర్తి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మి ల్లర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. సరైన సమయంలో బి య్యం ఇవ్వని మిల్లులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. రెండు నుంచి మూడు సీజన్ల కు సంబంధించిన సీఎమ్మాఆర్ (కస్టమ్ మి ల్లింగ్ రైస్) ఇంకా అందజేయకపోవడాన్ని స ర్కార్ సీరియస్గా తీసుకున్నది. ఈ మేరకు రెండ్రోజుల కిందట హైదరాబాద్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీచేశారు. వడ్లు తీసుకుని నిర్ణీత సమయం లో బియ్యం అందజేయని మిల్లర్లపై చర్య లు తీసుకోవాలని…, లేకుంటే అధికారుల పై వేటు తప్పదని హెచ్చరించారు. అవసరమైతే పక్క రాష్ర్టాల మిల్లులను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో జిల్లా అ ధికారులు అప్రమత్తమయ్యారు. వనపర్తి జిల్లాలోని 120 మిల్లులు బకాయిపడ్డ సీఎంఆర్ను సాధ్యమైనంత త్వరగా తెప్పించేందుకు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో మిల్లర్కు 5 నుంచి 20 టన్నుల వరకు వడ్లు కేటాయించారు. యాసంగి 2020-21 సీజన్కు సంబంధించి జిల్లాలోని మిల్లులకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. 1.82 లక్షల టన్నుల బియ్యం సీఎంఆర్గా ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో ఇప్పటివరకు సగానికి పైగా సీఎంఆర్ను మిల్లర్లు అందించలే దు. 2021-22 వానకాలం సీజన్కు సంబంధించి మిల్లుల కు 2.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించగా.. సీఎంఆర్ కింద 1.19 లక్షల టన్నులు రావాల్సి ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో సీఎంఆర్ రావాల్సి ఉన్నప్పటికీ.. నిర్ణీత సమయంలోగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికంగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న జిల్లాగా వనపర్తి నిలిచింది.
ప్రత్యేక టాస్క్ఫోర్స్..
మిల్లర్ల నుంచి ధాన్యం సేకరణతోపాటు బియ్యాన్ని రీ సైక్లింగ్ చేయకుండా నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ నియమించనున్నారు. ఇందులో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు భాగం కానున్నారు. రేషన్ బి య్యాన్ని అక్రమంగా దాచినట్లు తెలిస్తే వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయనున్నారు. వడ్లు రాష్ట్రం దాటడం, సీఎంఆర్ బియ్యం కోసం రీసైక్లింగ్ చేయడం వం టి వాటిపై టాస్క్ఫోర్స్ టీం నిఘా పెంచనున్నది. ప్రత్యేక ఇ న్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది. సీఎమ్మార్ సమీకరణ కోసం డీసీఎస్వో ఆధ్వర్యంలో ప్రత్యేక టీం మిల్లింగ్ వేగాన్ని పరిశీలించనున్నారు. అయితే, మిల్లర్ల సంఘం ప్రతినిధులు మంత్రి గంగుల కమాలాకర్ను కలిసి తాము మిల్లింగ్ను వేగవంతం చేసి అతి త్వరలో సీఎమ్మార్ను అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎమ్మార్ ఇవ్వని మిల్లులను బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడడం లేదు. డీఫాల్టర్గా ఒకసారి ముద్ర పడితే ధాన్యం కేటాయింపులు ఉండే అవకాశం లేనందున మిల్లర్లు కూడా సాధ్యమైనంత త్వరగా బియ్యం అందజేసే అవకాశం ఉన్నది.
ఆదేశాలు తప్పనిసరిగా పాటిస్తాం..
ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరి గా అమలు చేస్తాం. సీఎమ్మార్ త్వ రితగతిన అందించాలని మిల్లర్లకు సూచనలందించాం. ఈ విషయం లో ప్రభుత్వం చాలా కఠినంగా వ్య వహరించనున్నది. సాధ్యమైనంత త్వరగా మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. లేకుంటే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం. టాస్క్ఫోర్స్ టీంలు కూడా రంగంలోకి దిగుతాయి. రానున్న సీజన్ను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందిస్తున్నాం.
– కొండల్రావు, డీఎం, వనపర్తి