హన్వాడ/గద్వాల/గద్వాల టౌన్, ఏప్రిల్ 4 : ముదురుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమం లో పనుల నిమిత్తం బయటికి వచ్చే వారు వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు సైతం ఎండను తాళలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెలను కాసే కాపరులు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు. వడగాలులు వీస్తుండడంతో ప్రయాణికులు సైతం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్తో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ తగలకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉం డాలి. ఎండ తగలకుండా స్కా ర్ఫ్, రుమాలు, క్యాప్, గొడుగు రక్షణగా ఉపయోగించాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులకు వడదెబ్బ తగిలే అవకాశమున్నది. వడదెబ్బకు గురైతే వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేయించాలి.