పాలమూరు, జూలై 1 : జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగింది. పరీక్ష నిర్వహణకు 111 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే కేంద్రాల గేట్లను మూసివేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. మొత్తం 34,459మంది అ భ్యర్థులకుగానూ మొదటి సెషన్ పరీక్షకు 29,546మం ది హాజరు కాగా, 4,913మంది గైర్హాజరయ్యారు. 85.73శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెషన్కు 34,459మందికిగానూ 29,429మంది అభ్యర్థులు హాజరయ్యారు. 5,030 మంది గైర్హాజరుకాగా, 85.40శాతం హాజరు నమోదైం ది. జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్డు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేశారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ నర్సింహ పర్యవేక్షించారు. అందరి సహకారంతో గ్రూప్-4 పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 1 : మూడంచెల పటిష్టమైన భద్రత మధ్య గ్రూప్-4 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ నర్సింహ తెలిపారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష ముగిసే వరకు నిరంతరం రూట్ మొబైల్స్తో పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇం టర్నెట్ సెంటర్లు మూసివేయడంతోపాటు చుట్టుపక్కల లౌడ్స్పీకర్లు లేకుండా చూశామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, జూలై 1 : గ్రూప్-4 పరీక్ష సందర్భంగా ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లల్లో బస్సులను అందుబాటులో ఉంచారు. మండలకేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదనంగా బస్సులను నడిపించారు. అభ్యర్థులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
నవాబ్పేట, జూలై 1 : మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-4 పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ నర్సింహ తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులు, అభ్యర్థుల హాజరుశాతాన్ని పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మొత్తం 240 మంది అభ్యర్థులకుగానూ 201మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంపీడీవో, పరీక్షల లైజన్ ఆఫీసర్ శ్రీల త, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపా రు. కాగా చౌదరిగూడ మండలం పెద్ద వెల్కిచర్ల సర్పంచ్ భూపాలాచారి యన్మన్గండ్లలో గ్రూప్-4 పరీక్ష రాశా రు. ఎస్పీ వెంట నవాబ్పేట ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
జడ్చర్ల, జూలై 1: జడ్చర్ల పట్టణం, మండలంలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగిం ది. పరీక్ష నిర్వహణకు మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేం ద్రంలోకి అనుమతించారు. నిర్ణీత సమయానికి రాని అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేశారు.
హన్వాడ, జూలై 1 : మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్ర వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై రవినాయక్, తాసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. మొత్తం 216మంది అభ్యర్థులకుగానూ 185మంది పరీక్ష రాశారు.
దేవరకద్ర, జూలై 1 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, వెంకటసాయి కళాశాల, స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు.
భూత్పూర్, జూలై 1 : పట్టణంలో నిర్వహించిన గ్రూ ప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. న్యూఎరా హైస్కూల్లో 312మంది అభ్యర్థులకుగానూ 262మంది, పాలమూరు ఐటీఐ కళాశాలలో 240మందికిగానూ 208 మంది హాజరయ్యారు. మొత్తం 562మందికిగానూ 470మంది హాజరు కాగా, 84శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు లైజన్ ఆఫీసర్ చెన్నకిష్టన్న తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాలానగర్, జూలై 1 : మండలకేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 216మంది అభ్యర్థులకుగానూ 183 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.
మహ్మదాబాద్, జూలై 1 : మండలంలోని వెన్నాచేడ్లో నిర్వహించిన గ్రూప్-4 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, ఫౌండేషన్ సభ్యుడు మనోహర్రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.