ఊట్కూర్, జనవరి 27 : కంటి చూపు సమస్యలతో బా ధ పడేవారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెండో విడుత ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఊ ట్కూర్, పులిమామిడి గ్రామాల్లో కంటివెలుగు శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 18 ఏండ్లు నిండిన వారి నుంచి వృద్ధుల వరకు అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తున్నారు. శుక్రవారం స్థాని క కంటివెలుగు శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్రావు తనిఖీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూ ర్తి నిబద్ధతతో పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆ దేశించారు. ప్రారంభం నుంచి నేటి వరకు కంటి పరీక్షలు చేయించుకున్న వారు, కళ్లద్దాలు పొందిన వారి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక పీహెచ్సీని సందర్శించి దవాఖాన రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాని పక్షం లో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి సుమలత, డాక్టర్ భవాని, ఎంపీహెచ్ఈవో విజయకుమార్, సూపర్వైజర్ మణిమాల, ఆప్తమాలజిస్టు జనార్ద న్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ‘కంటివెలుగు’
మాగనూర్, జనవరి 27 : మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమంలో శుక్రవారం 125 మందికి కంటి పరీక్షలు నిర్వహించి నట్లు డాక్టర్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. 12 5 మందిలో 55 మందికి అంధత్వ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి పరీక్షలు చేసి 35 మందికి అద్దాలు ఇచ్చారు. 20 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఇద్దరిని కంటి శస్త్ర చికిత్సకు రెఫర్ చేయడం జరిగిందని డాక్టర్ తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
కృష్ణ, జనవరి 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని హిందూపూర్లో శుక్రవారం కంటివెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వా రికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మల్లేశ్, నరేశ్, మల్లేశ్వరమ్మ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చక్కటి కంటి చూపు
మక్తల్ అర్బన్, జనవరి 27 : మండలంలో కంటివెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. కంటివెలుగు కార్యక్రమంతో వేలాది మందికి చూపు అందుతున్నదని ఎం పీడీవో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వా మి అన్నారు. మక్తల్ పీహెచ్సీలోని మూడు సెంటర్లలో శుక్రవారం మక్తల్ 7వ వార్డు ఎంపీడీవో కార్యాలయం, మంతన్గోడ్ సెంటర్, గుడిగెండ్ల సెంటర్లో కంటివెలుగు కార్యక్రమం ఇన్చార్జి డాక్టర్ తిరుపతయ్య సమక్షంలో కొనసాగింది. 7వ వార్డు సెంటర్లో 151 మంది, గుడిగెండ్ల సెంటర్లో 145 మంది, మంతన్గోడ్ సెంటర్లో 111 మంది మొత్తం 407 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అభినేశ్, నరేంద్ర, మణికంఠ, రాజారత్నం, సులోచన, శోభారాణి, శంకరప్ప, నర్సింహులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలి
కోస్గి, జనవరి 27 : ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా సాగాలని, క్యాంప్కు వచ్చిన ప్రతిఒక్కరికీ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. గుండుమాల్ పీ హెచ్సీలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని శు క్రవారం ఆయన తనిఖీ చేశారు. వైద్యులు దవాఖానకు వ చ్చిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందజేయాలన్నారు. సమయానికి వైద్యు లు దవాఖానలో ఉండాలని, సమయపాలన పాటించకుం టే చర్యలు తప్పవన్నారు. అధికారులు గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య సేవల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, డాక్టర్ కిష్టమ్మ పాల్గొన్నారు.
కేంద్రాల పరిశీలన
మద్దూర్ (కొత్తపల్లి), జనవరి 27 : కంటి సమస్యలతో బాధపడుతున్న వా రు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మద్దూర్, కొత్తపల్లి మండలాల కేంద్రా ల్లో శుక్రవారం నిర్వహించిన కంటివెలు గు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. సిబ్బంది సమయానికి హాజరై శిబిరానికి వచ్చే ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి వారికి కావాల్సిన అద్దాలను అందజేయాలని సూ చించారు. ఇప్పటి వరకు కంటి పరీక్షలు నిర్వహించిన రికార్డులను ఆయన పరిశీలించారు.