నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 20 : బతుకమ్మ చీరల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీపై మంగళవారం తాసిల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు పైబడి తెల్ల రేషన్ కా ర్డు కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చే యాలన్నారు. ముందస్తుగా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పంపిణీకి ముందు రోజు దండోరా వేయించి అర్హులైన వారికి స్లిప్పులు ఇవ్వాలని, అందులో ఎక్కడ చీర ఇస్తామో రాసి ఉండాలన్నారు. ముస్లిం మహిళలకు కూడా చీరలను పంపిణీ చేయాలని, చౌక ధరల దుకాణాల నుంచి పంపిణీ చేయరాదన్నారు. పాడైపోయిన చీర ఉంటే వేరే చీర ఇవ్వాలని, చీరతో పాటు జాకెట్ కూడా అదే కవర్లో ఉంటుందన్నారు. జిల్లాలో 2,06,186 మంది లబ్ధిదారులు ఉండగా, జిల్లాకు ఇప్పటి వరకు 1,52,000 చీరలు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే మండలాలు, మున్సిపాలిటీలకు చీరలను పంపించినట్లు తెలిపారు. చనిపోయిన, వలస వెళ్లిన, పెండ్లి చేసుకొని వేరే ఊరు వెళ్లిన వారిని గుర్తించాలన్నారు. చీర తీసుకునేందుకు ఆధార్, ఇతర గుర్తింపు కార్డు ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీ ఆర్డీవో గోపాల్నాయక్, ఆర్డీవో రాంచందర్రావు, హ్యండ్లూమ్ ఏడీ బాబు తదితరులు పాల్గొన్నారు.
మండలాలకు తరలిన చీరలు
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 20 :బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది. నిధులను సైతం విడుదల చేస్తున్న ది. ముఖ్యంగా 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు సర్కార్ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నది. మండలాలకు 70 శాతం మొద టి విడుతలో వచ్చిన చీరలను సోమ, మం గళవారం జిల్లాకేంద్రం నుంచి తరలించా రు. జిల్లాలో 11 మండలాలకు లక్ష 24 వేల, 383 చీరలు, పేట, మక్తల్, కోస్గి ము న్సిపాలిటీలకు లక్ష44వేల331చీరలను తరలించారు. ఇంకా మండలాలకు 53,309 చీరలు, మున్సిపాలిటీలకు 61,857 చీరలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. చీరల తరలింపును డీఆర్డీఏ పీడీ గోపాల్నాయక్ పరిశీలించారు. కా ర్యక్రమంలో హ్యండ్లూమ్ డెవలప్మెంట్ అధికారి శేఖర్, గోదాము ఇన్చార్జి లక్ష్మణ్, అధికారులు, నిర్వాహకులు తదితరలు పాల్గొన్నారు.