కల్వకుర్తి, మే 5 : గ్రామాల్లోకి వచ్చే పగటి వేషగాళ్ల గారడీ మాటలను నమ్మి మో సపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలుచేస్తున్న దమ్మున్న సర్కార్ తమదేనని తెలిపారు. కల్వకుర్తి మున్సిపాలిటీ లో నిర్మించిన 240 డబుల్ బెడ్రూం ఇం డ్లకు రిజర్వేషన్ల ప్రాతిపదికన లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 240 ఇండ్లకు 492 మందిని ఎంపిక చేశామన్నారు. డ్రాలో ఇండ్లు రాని వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు అందజేస్తామన్నారు.
అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పలు పథకాలను అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. దే శంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రతిపక్ష నాయకుల గాలి మా టలు నమ్మి మోసపోవద్దని సూచించా రు. అలాంటి వారిపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రా సమయం లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్కుమార్, తాసీల్దార్ రాంరెడ్డి, మున్సిపల్ కమిషన ర్ అశ్రిత్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మ న్ విజయ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు శ్రీశైలం, గోపిరెడ్డి ల క్ష్మి, మంజుల, ఏజాస్, శ్రీనివాసులు, సై దులు, చందన, యాదమ్మ, మనోహర్రె డ్డి, బాలయ్య, మున్సిపల్, రెవెన్యూ సి బ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.