పాలమూరు/హన్వాడ/మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 1 : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 78మందికి రూ.42,28,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. హన్వాడలో 60లక్షలతో నిర్మించిన రైతుబజార్, రూ.25లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కష్టకాలంలో పేదలకు సీఎం సహాయనిధి అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ఆపదలో ఉన్నామని తమ దృష్టికి తీసుకొస్తే అన్నివిధాలా ఆదుకుంటామని వెల్లడించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కేంద్రంలో రూ.500కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు కిశోర్, చిన్నా, మోతీలాల్, నవకాంత్ పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం, జూ నియర్ కళాశాలల ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ క్యాలెండర్ను జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి మల్లికార్జున్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి యాదయ్య, రఘువీర్సింగ్, కోశాధికారి శ్రీనివాసులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, భీంరెడ్డి పాల్గొన్నారు. అలాగే వ్యాయా మ ఉపాధ్యాయ సంఘం రూపొందించిన క్యాలెండర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రమేశ్బాబు, వ్యా యామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, వడెన్న, జీ.శ్రీనివాసులుగౌడ్, పరుశరాం, అయూబ్, రాంచందర్, అరుణజ్యోతి, ముస్తాఫా, రామేశ్వర్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 1 : ఆరెకటికల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆరకటికె సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరెకటికలకు అందాల్సిన ఆధునిక పరికరాలు, వ్యాపార రుణాలు తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్లో ఆరెకటికల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.కోటి మం జూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ సంరక్షక నేత కార్ ప్రేమ్లాల్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందూలాల్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, మోహన్లాల్, దశరథ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.