గద్వాల అర్బన్, ఏప్రిల్ 5 : లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
పటిష్ట భద్రత కల్పించాలని ఐటీబీపీ బలగాల డీఐజీ సురేందర్ కత్రి ఆదేశించారు. ప్రజలు ప్రలో
భాలకు గురికాకుండా తమ ఓటుహక్కును వినియో గించుకునేలా చూడాలని సూచించారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని ఆయన వివరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ చాంబర్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
ఎన్నికల సందర్భంగా జిల్లాలోని సమ స్యాత్మక గ్రామాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, సరి హద్దు చెక్పోస్టుల వద్ద నగదు, మద్యం రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న కేంద్ర బలగాల కవాతు, వాహనాల తనిఖీలు, జిల్లాకు వచ్చే కేంద్ర బలగాలకు అవసరమైన వసతులు కల్పించే విషయంపై చర్చించారు. సమీక్షలో అదనపు ఎస్పీ గుణశేఖర్, ఐటీబీపీ కమాండెంట్ జోషి, డిప్యూటీ కమాండెంట్ బీఎస్రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డీఎస్పీ నరేందర్రావు, అసిస్టెంట్ కమాండెంట్ వినోద్కుమార్ తదితరులు ఉన్నారు.