మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 13 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా 6,528మందికి పరీక్షలు నిర్వహించి 1,131మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు డీహెచ్వో కృష్ణ తెలిపారు. దూరంచూపు సమస్య ఉన్న 585మందికి అద్దాల కోసం ఆర్డర్ పె ట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 1,26,452మందికి పరీక్షలు నిర్వహించి 18,959 మందికి అద్దాలను అందజేసినట్లు వివరించారు. కాగా కంటివెలుగు శిబిరాలను క్వాలి టీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ మోతీలాల్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 13 : అంధత్వ నివారణ కోస మే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. కౌకుంట్లలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించగా, వైద్యులు 189మందికి పరీక్షలు నిర్వహించి 47మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 21మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అప్పంపల్లిలో 130మందిని పరీక్షించి 14మందికి అద్దాలను అందజేశారు. మరో 9మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. చిన్నచింతకుంటలో 114మందిని పరీక్షించి నలుగురికి అద్దాలను పంపిణీ చేశారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశా రు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ స్వప్నాకిషన్రావు, ఎంపీటీసీలు కిష్టన్న వైద్యులు సంతోష్, రాధిక, షఫీఖ్ అహ్మద్, రాహుల్, బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
భూత్పూర్, ఫిబ్రవరి 13 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్ కోరారు. కొత్తమొల్గరలో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. మొత్తం 135మందికి పరీక్షలు నిర్వహించి 21మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. అదేవిధంగా పాతమొల్గరలో 135మందికి పరీక్షలు నిర్వహించి 14మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు అబ్దు ల్ రబ్బు, హిమబిందు, రాధిక పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 13 : కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. మున్సిపాలిటీలోని ఐదోవార్డులో 127మందికి పరీక్షలు నిర్వహించి 23మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో ఆరుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. అలాగే 16వ వార్డులో 104మందిని పరీక్షించి 13 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. అదేవిధంగా మండలంలోని ఆలూర్లో 132మంది పరీక్షలు నిర్వహించి 27మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 23మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. చిట్టెబోయిన్పల్లిలో 82మందికి పరీక్షలు నిర్వహించి 17మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ సమత తెలిపారు.
మూసాపేట, ఫిబ్రవరి 13 : మండలంలోని పోల్కంపల్లి, కనకాపూర్తండాలో కంటివెలుగు శిబిరాలను జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చే యించుకొని అంధత్వ నివారణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీ వో సరోజ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, గూపని కొండయ్య, ప్రవీణ్కుమార్రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 13 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని మోతీఘణపూర్లో 130మందిని పరీక్షించి 11మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. మరో 15మందికి అద్దాల కోసం ఆర్డర్ చే సినట్లు పేర్కొన్నారు. అలాగే పెద్దరేవల్ల్లిలో 128మందికి పరీక్షలు నిర్వహించి 23మందికి అందజేసినట్లు తెలిపారు. మరో 11మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు చెప్పారు.
రాజాపూర్, ఫిబ్రవరి 13 : మండలంలోని దోండ్లపల్లిలో 116మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 20మందికి దూరంచూపు సమస్య ఉన్నట్లు గుర్తించి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్లు మౌనిక, రవికుమార్, ఉత్తరయ్య పాల్గొన్నారు.
హన్వాడ, ఫిబ్రవరి 13 : మండలంలోని పలు గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. హన్వాడలో 2,345మంది, టంకరలో 2,063మంది, సల్లోనిపల్లి 646మంది, నాయినోనిపలి ్ల896మంది, వేపూర్ 287మంది, ఇబ్రహీంబాద్లో 821మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 13 : మండలకేంద్రంతోపాటు పెద్దతండాలో 247మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను అందజేసినట్లు మండల వైద్యాధికారి మహ్మద్ తెలిపారు. కంటివెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.