అండాదండా నీవేనయ్యా దయుంచయ్యా దేవా.. అంటూ పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం నిమజ్జనానికి తరలించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలంతా మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి మొ క్కులు తీర్చుకున్నారు.
నిమజ్జనం సందర్భంగా పోటాపోటీగా లడ్డూ వేలం పాట నిర్వహించారు. అనంత రం చిన్నా, పెద్ద తేడా లేకుం డా భక్తులు భారీగా వినాయక విగ్రహాల ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.