పెబ్బేరు, మార్చి 24 : పెబ్బేరు మత్స్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రాష్ట్రం లో మత్స్యరంగ అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఏడు రోజు ల ఎన్ఎస్ఎస్ శిబిరం ఆదివారం ముగియగా ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాబోయే కాలంలో మత్స్య రంగానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.
అనంతరం ఆమె విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అంతకు ముందు విద్యార్థులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛత కార్యక్ర మం నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి దేవానంద్, బోధక సిబ్బంది ముత్తప్పకవి, అనూష, శాంత, హారిక, రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.