రంగురంగుల పూల మొక్కలు, ఆకట్టుకునే విగ్రహాలు.. అలరించే చిత్రాలు.. ఓపెన్ జిమ్లు.. వాకింగ్కు ప్రత్యేక ట్రాక్లు.. చిన్నారులకు ఆటవిడుపు నిచ్చే వస్తువులు.. సకల సౌలత్లతో ఆకర్షణీయంగా పార్కులు దర్శన మిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. జిల్లాకేంద్రంలో 31 ట్రీ పార్కులు, నాలుగు మేజర్ పార్కులను రూ.20 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే రూ.6 కోట్లతో అయిజ బల్దియాలో మరో 11 స్థలాలను ఆహ్లాదకరంగా మార్చారు. వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో పార్కుల నిర్మాణం చేపట్టారు. సంగాల చెరువు పర్యాటకంగా మారింది. రూ.2.30 లక్షలతో ఎల్ఈడీ లైట్లు, సేద తీరేలా ప్రత్యేక షెడ్డు.. గుట్టలపై రకరకాల జంతువుల, పక్షుల బొమ్మలతోపాటు శివుడు విగ్రహం, జాతీయ జెండాలతోపాటు ఐలవ్ గద్వాల సెల్ఫీ పాయింట్ను తీర్చిదిద్దారు. నీటిలో బోటు షికారు ఏర్పాటు చేయడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం, సాయంత్రం, సెలవు రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా సరదాగా గడుపుతున్నారు. అలాగే గ్రామాల్లో పల్లెప్రకృతి, స్మృతి వనాలు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రజలు సేదతీరుతున్నారు.
గద్వాల, అక్టోబర్ 19 : రాష్ట్ర ఏర్పాటుతో పట్టణాల్లో పచ్చదనం పర్చుకున్నది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా అధికారులు ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని ప్రజలకు ఉపయోగప పార్కులుగా రూపొందిస్తున్నారు. గత పాలకుల హయాంలో ప్రజలు పనులు పూర్తి చేసుకొని అలసిపోతే జిల్లాలో సేద తీరడానికి ఒక్క పార్కు కూడా లేక ఇబ్బంది పడేవారు. కనిపించిన చెట్ల కింద సేద తీరేవారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన 10శాతం స్థలాలు అప్పటి పాలకుల అండదండలతో నేతలు కబ్జాలు చేసుకున్నారు. ఇది గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని గుర్తించి పట్టణ ప్రజలకు ఉపయోగపడేవిధంగా పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. దీంతో పార్కులు ఏర్పాటై జిల్లాలోని మున్సిపాలిటీలు పర్యాటక శోభను సంతరించుకోనున్నాయి. గతంలో గద్వాల పట్టణంలో ప్రజలు సేద తీరడానికి, ఆహ్లాదంగా గడపడానికి ఒక్క పార్క్ కూడా ఉండేది కాదు. అందరూ ఆహ్లాదకరంగా, సరదాగా గడిపేందుకు వీలుగా పార్కుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టగా ఎమ్మెల్యేలు అందుకు నిరంతరం కృషి చేశారు.
జిల్లా కేంద్రానికి సమీపంలో, రాయిచూర్కు వెళ్లే దారిలో సంగాల చెరువు వద్ద పార్కును సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. వాకింగ్ చేయడానికి ట్రాక్, గ్రీనరీ ఏర్పాటుతోపాటు పార్క్ చుట్టూ రకరకాల పూలమొక్కలు నాటారు. అదేవిధంగా మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి ఏపుగా పెరిగిన మొక్కలను నాటి, పార్కు నలువైపులా రోడ్డును నిర్మించారు.పార్కు మొత్తం నిర్మాణానికి రూ.2.30లక్షలు ఖర్చు చేశారు. ఎల్ఈడీ లైట్లు, చిన్నారులు ఆడుకోవడానికి ఆటవస్తువులను కూడా సమకూర్చారు. కుటుంబంతో వచ్చిన వారు సేద తీరడానికి ప్రత్యేక షెడ్డును కూడా నిర్మించారు. అక్కడ ఉన్న గుట్టలపై రకరకాల జంతువులు, పక్షుల బొమ్మలు ప్రజలను ఆకట్టుకునేలా రంగురంగులతో గీశారు. శివుడి విగ్రహంతోపాటు ఎత్తైన ప్రదేశంలో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. కాగా ఐ లవ్ గద్వాల అనే సింబల్ పార్కుకు వచ్చే వారిని ఆకట్టుకుంటున్నది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఆహ్లాదకరంగా, సుందరంగా పార్క్ నిర్మించడంతో పట్టణ ప్రజలు సేద తీరడానికి, వాకింగ్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. సంగాల చెరువులో ప్రజలు షికారు చేయడానికి బోటు సౌకర్యాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇదివరకే కల్పించారు.ఈక్రమంలో సం గాల చెరువు త్వరలో మినీట్యాంక్ బండ్గా రూపుదిద్దుకోనున్నది.ఆ పనులు పూర్తయితే ప్రజలు అక్కడికి రాత్రి వేళ వెళ్తే హైదరాబాద్ లోని ట్యాంక్బాండ్పై కూర్చున్న అనుభూతి కలగనున్నది.
జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్లో స్మృతి వనాన్ని నిర్మించారు. అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో వాకింగ్కు వచ్చిన మహిళలు జిమ్ సామగ్రిని కూడా వినియోగించుకుంటున్నారు. మిగతా సమయంలో పట్టణ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సేద తీరడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ వనంలో అమరవీరుల స్తూపం ఏర్పాటుతోపాటు దాని నలుమూలల రాష్ట్ర చిహ్నాలు జమ్మిచెట్టు, జింక, తంగేడు పూలను నెలకొల్పారు. సిమెంటుతో చెక్కను పోలిన విధంగా గుడిసెలు, బెంచీలు ఏర్పాటు చేశారు. వాకింగ్ ర్యాక్ల పక్కన రంగురంగుల పూలమొక్కలు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉన్నాయి. సంగాల పార్కు, స్మృతివనం జిల్లాకే తలమానికంగా నిలిచాయి. సెలవు రోజుల్లో ఈ పార్కులు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పాతహౌసింగ్ బోర్డు కాలనీలో పీజేపీ కుడి కాల్వ వద్ద సుమారు అరకిలోమీటర్ పరిధిలో పార్కు నిర్మాణం చేపట్టారు. ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్తోపాటు రకరకాల పూలమొక్కలు సందర్శకులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో 31 టీపార్కులతోపాటు నాలుగు మేజర్ పార్కులను రూ.11.34లక్షలతో ఏర్పా టు చేశారు. వీటితోపాటు అయిజ మున్సిపాలిటీలో ఆరుపార్కుల అభివృద్ధికి, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.6 కోట్లు మంజూరు చేశారు. దీంతో అక్కడ 11 పార్కులను నిర్మించారు. ఇతర పనులు కొనసాగుతున్నాయి. వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో ట్రీపార్కుల నిర్మాణం చేపట్టారు. ఈ పార్కుల ఏర్పాటుతో సందర్శకులు ఆహ్లాదంగా గడిపేందుకు, మున్సిపాలిటీ ప్రజలు సేద తీరడానికి అవకాశం లభించింది.
పార్కుల ఏర్పాటుతో సెలవులు వచ్చినప్పుడు పిల్లలతో కలిసి వెళ్లి అ క్కడ సరదగా గడిపే అవకాశం లభించింది. గద్వాల ప్రజ లు సేద తీరడానికి గతంలో ఒక్క పార్కు కూడా ఉండేది కాదు. ఇప్పుడు పార్కులు అందుబాటులోకి రావడంతో సెలవు రోజులు, సాయంత్రం వేళ ప్రశాంతంగా గడిపే అవకాశం ఏర్పడింది.
అప్పట్లో జిల్లా కేంద్రంలో సరైన పార్కులు లేక ఉదయం, సాయం త్రం వేళ సేద తీరుదామంటే ఇబ్బందిగా ఉండేది. ప్రసు ్తతం సంగాల చెరువు వద్ద పార్కు, స్మృతివనం ఏర్పాటుతో పురః ప్రజలు సేద తీరడానికి అవకాశం ఏర్పడింది. పక్కనే ఉన్న చెరువులో షికారు చేయడానికి బోటు సౌకర్యం కల్పించడంతో పట్టణ ప్రజలు ఎక్కువగా అక్కడికి వెళ్లి సరదాగా గడినిప అనంతరం పార్కులో సేద తీరుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో ట్రీ పార్కులు ఏర్పాటు చేయడంతో ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడిపే అవకాశం లభించింది.