మూసాపేట: పొందుతున్న లబ్ధిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీనీ నిండు మన స్సుతో దీవించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మూసాపేట రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ. 33,03,828 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని, మీగతా పార్టీల నాయ కులా ఎన్నికల సమయంలో పాదయాత్రల పేరుతో మభ్య పెట్టే పార్టీ మాది కాదన్నారు.దేశంలో 29 రాష్ర్టాలు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా తెలంగాణలో చేపట్టే సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. కానీ ఇక్కడ ఆ పార్టీల నాయకులే వచ్చి చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారు. ఆలాంటి వారి ఉచ్చులో ఎవరూ పడోద్దని పిలుపుని చ్చారు.
తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఉందని గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ కేసీఆర్ను దీవించి, ఆ పార్టీ ప్రభుత్వమే పది కాలాల పాటు అధికారంలో ఉండేలా ప్రజలే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.
తెలంగాణలో మత్స్య సంపద పెరిగింది
టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు కార్యచరణగా చెరువుల పూడిక తీత తీయించడంతో పాటు, ఎత్తిపోతల పథకం ద్వారా నదీ జలాలతో చెరువులు నింపడంతో పాటు, ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం వల్ల మత్స్య సంపద పెరిగిందని, అందుకే ప్రతి గ్రామంలో నేడు చేపలు విరివిగా లభ్యమౌతున్నాయని, జాలర్లకు కూడా ఉపాధి పెరిగిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతికొండయ్య, జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మత్స్య సహకారం సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కమటీ సభ్యుడు సత్యనారాయణ, తాసీల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి, రైతుబంధు సమితీ మండల కోఆర్డినేటర్ రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలా ధ్యక్షుడు లక్షీనరసింహా యాదవ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.