భూత్పూర్, జనవరి 10 : రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అ మలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మంగళవారం పట్టణంలోని కేవీఎన్ ఫంక్షన్హాల్లో మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలతోపాటు ఎమ్మెల్సీ బండప్రకాశ్ హా జరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో చేపల పెంపకానికి కేవలం రూ.కోటి కేటాయిస్తే.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లను కేటాయించారన్నారు. కరివెన రిజర్వాయర్లో కోటి చేపపిల్లలను పెంచే అవకాశం ఉన్నదన్నారు.
ఎమ్మెల్సీ ప్రకాశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో మాట్లాడి ముదిరాజ్ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల బైక్లు అందజేశామన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని మత్స్యకారులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బ స్వరాజ్గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, సింగిల్విండో చైర్మ న్ అశోక్రెడ్డి, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, మత్స్యసహకార సంఘం నాయకులు సత్యనారాయణ, మనోహర్, వెంకట్రాములు, రామకృష్ణ, వెంకట్రాజ్, ర వీందర్, మల్లేశ్, శ్రీశైలం, యాదగిరి పాల్గొన్నారు.