దేవరకద్ర, జనవరి 30 : అంధత్వరహిత తెలంగాణ నిర్మాణం కోసమే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని చౌదర్పల్లిలో సోమవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దృష్టిలోపంతో బాధపడుతున్న వారు కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇద్ద రు అంగన్వాడీ టీచర్లు, 18మంది ఆయాలకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జనవరి 30 : మున్సిపాలిటీలోని 3, 15 వార్డుల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను డీఎంహెచ్వో కృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మేనేజర్ శశిధర్ పరిశీలించారు. కంటి సమస్యతో వచ్చిన ప్రతిఒక్కరిని పరీక్షించి అవసరమైన మందులు, కండ్లద్దాలు అందజేయాలని సూచించారు. కాగా 3వ వార్డులో 207మందికి పరీక్షలు నిర్వహించి 61మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 18మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 15వ వా ర్డులో 188మందికి పరీక్షలు నిర్వహించి 48మందికి అద్దా లు పంపిణీ చేశారు. మరో 17 మందికి అద్దాలకోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్ సతీశ్, డాక్టర్ సుచరిత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని గంగాపూర్, చిన్న ఆదిరాల గ్రామాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. గంగాపూర్లో 177మందికి పరీక్షలు నిర్వహించి ముగ్గురికి అద్దాలు పం పిణీ చేశారు. మరో ఆరుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. చిన్న ఆదిరాలలో 205మందికి పరీక్షలు నిర్వహించి 26మందికి అద్దాలు అందజేశారు. మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు.
మిడ్జిల్, జనవరి 30 : 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారి కృష్ణ అన్నారు. మండలంలోని ఈదులబావితండాలో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో వందశాతం పరీక్షలు నిర్వహించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కాగా మండలంలో 386మందికి పరీక్షలు నిర్వహించి 21మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 16మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశా రు. కార్యక్రమంలో వైద్యాధికారులు మనుప్రియ, కృష్ణకుమార్, సిబ్బంది దేవయ్య, జంగయ్య, పంచాయతీ కార్యదర్శి సాయన్న తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 30 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలో 165మందిని పరీక్షించి 36 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 41మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. చిన్నరేవల్లిలో 171మందికి పరీక్షలు నిర్వహించి 30మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో ముగ్గురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు. మండలకేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో కృష్ణారావు పరిశీలించారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ఆరోరోజు సోమవారం విజయవంతంగా సాగింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 45 శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేశారు. మొత్తం 9,180మందిని పరీక్షించి 1,073మందికి అద్దాలను అందజేశారు. అలాగే 625 మందికి దూరంచూపు సమస్య ఉన్నట్లు గుర్తించి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. ఇప్పటివరకు మొత్తం 57,583మందికి పరీక్షలు నిర్వహించి 9,166మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. 5,722మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
రాజాపూర్, జనవరి 30 : మండలకేంద్రంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ రాంబాయి పరిశీలించారు. శిబిరంలో 185మందికి కంటి పరీక్షలు నిర్వహించి 43మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 26మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్రావు, కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్ మౌనిక, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట, జనవరి 30 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నవాబ్పేట, పల్లెగడ్డ, కొల్లూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను మండల వైద్యాధికారి విజయలక్ష్మి పరిశీలించారు. నవాబ్పేటలో 215మందికి పరీక్షలు నిర్వహించి 19మందికి కండ్లద్దాలు అందజేశారు. 14మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. పల్లెగడ్డలో 206మందిని పరీక్షించి 48మందికి అద్దాలు అందజేశారు. 9మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కొల్లూరులో 266మందికి పరీక్షలు నిర్వహించి 24మందికి కండ్లద్దాలు అందజేశారు. 16మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది బీచుపల్లిగౌడ్, శ్రీనివాస్, శకుంతల, శరబలింగం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, జనవరి 30 : మున్సిపాలిటీలోని నాల్గోవార్డులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ప్రారంభించారు. అనంతరం కుష్టువ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. నాల్గోవార్డులో 278మందికి పరీక్షలు నిర్వహించి 71మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. అలాగే కప్పెటలో 269మందికి పరీక్షలు నిర్వహించి 60మందికి అద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గడ్డం నాగమ్మ, రామకృష్ణ, సర్పంచ్ వేణుగోపాలాచారి, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు, యాదయ్య, సురేశ్, తిరుతపయ్య, రాకేశ్, డాక్టర్లు అబ్దుల్ రబ్బు, రాధిక, హిమబిందు, సూపర్వైజర్లు యాద మ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, జనవరి 30 : కౌకుంట్ల మండలంలోని పేరూర్లో 138మందికి పరీక్షలు నిర్వహించి 9మం దికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరొకరికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. చిన్నచింతకుంటలో 204మందికి పరీక్షలు నిర్వహించి 23మందికి అద్దాలను అందజేశారు. మరో 27మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మద్దూర్లో 181మందిని పరీక్షించి ఒకరికి అద్దాలను అందజేశారు. మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీఖ్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, ఖాద ర్, సూపర్వైజర్ సుశీల పాల్గొన్నారు.
గండీడ్, జనవరి 30 : మండలకేంద్రంలో ఏర్పాటు చేసి న కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ జ్యోతి పరిశీలించారు. ఉమ్మడి గండీడ్ మండలంలో మొత్తం 975మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మహ్మదాబాద్ మండలంలోని సంగాయిపల్లి, గండీడ్ మండలంలోని మన్సూర్పల్లిలో మంగళవారం కంటివెలుగు శిబిరాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.