బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ఆదరణ కొనసాగుతున్నది. గురువారం సీసీకుంట, కోడేరు
మండల కేంద్రాల్లో పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి. పార్టీశ్రేణులు కుటుంబ
సమేతంగా తరలిరావడంతో గులాబీ జోష్ నెలకొన్నది. రెండు ప్రాంతాల్లో కనీవిని ఎరుగని రీతిలో
వేడుకలు జరిగాయి. కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. చిన్నచింతకుంటలో
సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్
రెడ్డితోపాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి హాజరయ్యారు. అలాగే కోడేరు సమ్మేళనంలో
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మంచి పనులు
చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలబడాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు
ఓటేసి టాప్ గేర్లో పరుగులు పెట్టించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలు
చెప్పేందుకు పగటి వేషగాళ్లు వస్తుంటారని, వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.
మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దేవరకద్ర రూరల్, మే 18 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే దేశం గర్విచదగ్గ స్థాయిలో తెలంగాణ నంబర్వన్ రాష్ట్రంగా ఎదిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ గులాబీ జెండా లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడేది కాదన్నారు. ఎప్పుడో ఏర్పడిన రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లో గొప్పగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్యలు వినిపించేవని, మహిళలు బిందెలతో రోడ్లపై దర్శనమిచ్చేవారని, ఎ మ్మెల్యేలు వెళ్తే తాగునీటి ఎద్దడి తీర్చాలని విన్నవించేవారన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో.. ఆయన ని ధుల కింద ఏటా రూ.1.50 కోట్లు తీసుకొస్తే బోరు మోటారుకే సరిపోతుండేదన్నారు. నేడు దేశంలో విజన్ ఉన్న కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మరెక్కడా లేరన్నారు. మిషన్భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను ఇంటి వద్దకే తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అనుకున్న సమయానికి నీళ్లు అందించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని కొనియాడారు. రైతుబంధు కింద ఏటా ఎకరానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందుతుందని ఒక్క రైతు కూ డా అనుకోలేదన్నారు. కురుమూర్తి రాయుడి చెంతకు వెళ్లేందుకు రూ.41 కోట్లతో వంతెన నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ వంతెనతో 40 ఏండ్ల కోరిక నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులపై 30 చెక్డ్యాంలు నిర్మించామని.. 25 వేల ఆయకట్టకు అదనంగా సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద అత్యధిక సామర్థ్యంతో నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ పనులు 85 శాతం పూర్తయ్యాయని.. జూలై, ఆగస్టు నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి నీటిని నింపుతామన్నారు. ఇది పూర్తయితే నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఎన్నికలు సమీపిస్తు న్న తరుణంలో మాయమాటలు చెప్పేందుకు పగటి వేషగాళ్లు వస్తుంటారని, వారిని పట్టించుకోవద్దన్నారు. డబ్బులు ఆశచూపి ఓట్లు దండుకునేందుకు యత్నిస్తారని, జాగ్రత్తగా ఉం డాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశం లో ఎక్కడా లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు ఎందుకు అమలుకావడం లేదో ప్రశ్నించాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని వాళ్లు.. ఇక్కడకు వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటే ఎలా నమ్ముదామన్నారు. ప్రజలు ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా వంటి ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారన్నారు. ప్రతి గడపకూ లబ్ధిదారులు ఉన్నారని, ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు.
సోషల్మీడియాలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదుగుతుందన్నారు. గతంలో లేని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్ వల్లే పారిశ్రామిక ఔత్సాహికులు కంపెనీలు పెట్టేందుకు క్యూ కడుతున్నారన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది హాజరవుతున్నారని, చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ ప్రాంతానికి చెందిన వారితో హైదరాబాద్లో సమ్మేళనం ఏర్పాటుచేస్తే ఆరువేలమంది వచ్చారని, ఇదంతా ఎమ్మెల్యే ఆలపై ఉన్న అభిమానమే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ సమ్మేళనానికి మహిళలు కూడా భారీగా వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు రాజేశ్వరి, రాజశేఖర్రెడ్డి, నాయకులు రాము, సాయిలు, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.