దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), అక్టోబర్ 28 : కాంగ్రెస్ నాయకులు పన్నుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయన్నారు. కార్యకర్తలు నెల రోజులు కష్టపడి పనిచేస్తే.. మీ కోసం 5 ఏండ్లు సేవచేస్తానన్నారు. రైతుబంధు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలను ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని వారి కుటిల బుద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి తెలియజేయాలన్నారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమన్న సంగతి మరిచిపోయి.. ఇప్పుడు మాయమాటలతో మళ్లీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ పాషా, మహేశ్, మహేందర్, కురుమూర్తి, రాజు, మధు, విజ య్, బాలరాజు, బాలకొండ, శివ, శ్రీనివాసులుతోపాటు పలువురు బీజేపీ కా ర్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురేంద ర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.