దేవరకద్ర రూరల్: రైతులు నూతన వ్యవసాయ విధానంతో పాటు అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందే విధంగా చైతన్యవంతం చేసేందుకే ప్రభుత్వం రైతువేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో రైతువేదిక భవన ప్రారంభోత్సవం, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించి, ఆ వేదిక భవనాలలో ఎప్పుడు ఎలాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవశ్యకత వ్యవసాయ అదికారులపై ఉందన్నారు.
రైతులు ప్రతి వారం ఒకసారి రైతు వేదికలో సమావేశమై దేశ విదేశాలలో రైతులు అనుసరిస్తున్న నూతన వ్యవసాయ సాంకేతిక పద్దతులను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో మొత్తం 38 రైతువేదిక భవనాలు నిర్మించామన్నారు.
ముఖ్యమంత్రి చొరవతో కోయిల్సాగర్ నుంచి రామన్పాడు వరకు ఉన్న 36 కిలోమీటర్లలో మొత్తం 9 చెక్డ్యాంలు నిర్మా ణం చేసి ఎప్పుడూ నీరు నిల్వ ఉండేవిధంగా చర్యలు చేపట్టామని, దాని ద్వారా ఎడారిలా ఉన్న వాగు జీవనదిలా మారింద న్నారు.
54 కోట్ల నిధులతో పేరూర్ లిఫ్ట్ మంజూరైందని, ఆ లిఫ్ట్ ద్వారా అమ్మాపూర్ శివారు పొలాలకు కూడా సాగు నీరు అందిం చేందుకు కృషి చేస్తామన్నారు. అమ్మాపూర్ గ్రామంలో వడ్డెర సం ఘం, వాల్మీకి సంఘం కమ్యూనిటీ భవనాలకు 4 లక్షల చొప్పున నిదులు మంజూరైన ప్రొసిడింగ్ కాపీలను ఎమ్మెల్యే వారికి అందజేశారు.
అమ్మాపూర్ గ్రామానికి డబుల్బెడ్రూం ఇండ్లు, డ్రైనేజీ పనులు త్వరలోనే మంజూరు చేయిస్తామని తెలిపారు. ఇంటి స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి పంచాయితీకి ట్రాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఇచ్చిన సందర్భంగా గ్రామాలన్నీ పరిశుభ్రం గా మారుతున్నాయన్నారు.
అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని, గతంలోకి ఇప్పుడున్న పరిస్థితులకు తేడా గమనించి పనిచేస్తున్న ప్రభుత్వాలను ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్దన్రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వరీ, సర్పంచ్, పీఏసీఎస్ అధ్య క్షుడు సురేందర్రెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, జిల్లా రైతుబంధు సభ్యుడు కరుణాకర్రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు మణ్యంగౌడ్, మండలాధ్యక్షుడు కోట రాము, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.