మూసాపేట: ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి గుండె నిండా కారు గర్తు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారె ఎండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మూసాపేట ఆదర్శ మహిళా సెంటర్లో బుధవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 21మందికి కల్యాణ లక్ష్మి, షాధి ముభారక్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే సక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం స్వచ్ఛమైన మనస్సుతో గుండె నిండా కారు గుర్తు.. ముఖ్యమంత్రి కేసీఆర్ను గుర్తు ఉంచుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మినరసింహా యాదవ్, సర్పంచ్ శేఖర్రెడ్డి, భాస్కర్గౌడ్, గూపని కొండయ్య ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పం చ్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.