మక్తల్/మక్తల్ టౌన్, మార్చి 13 : గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.. అధికారులు ఇంటి వద్దకు వచ్చి బిల్లులు చెల్లించాల ని అడిగినా.. ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ స మీపంలోని సంగంబండ ఆర్ఆర్ సెంటర్లో ఏ ర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బుధవారం ఉద యం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయ్యా రు.
స్థానిక ఆంజనేయస్వామి, శివాలయంలో ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డితో కలిసి పూజలు చేశారు. ఆలయం నుం చి ఎద్దుల బండ్లపై వచ్చి.. సంగంబండ రిజర్వాయ ర్ పరిధిలో మిగిలిపోయిన 400 మీటర్ల కెనాల్ త వ్వకానికి భూమిపూజ చేశారు. అక్కడి నుంచి ప్రజా దీవెన సభకు బయలుదేరారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన సభకు నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సీఎం రేవంత్ సొంత జి ల్లా అయిన పాలమూరు ఉమ్మడి జిల్లాను అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వెనుకబడిన మక్తల్ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి నేతృత్వంలో అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు.
తామిచ్చిన ఆరు గ్యారెంటీల ను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెం చామని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మీ పథకాలను అ మలు చేశామన్నారు. వచ్చే వానకాలం సీజన్ నుం చి సాగు భూములకే రైతుభరోసా సాయం అందిస్తామని తెలిపారు. బీడు భూములు, రోడ్లు, ఇటుక బట్టీలు ఉన్న భూములకు సాయం అందించబోమని తెలిపారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం లో అంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యా లెన్సింగ్ రిజర్వాయర్లు, జూరాల బ్యాక్ వాటర్ కిం ద ముంపునకు గురై భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇ చ్చారు. పదేండ్లుగా పెండింగ్లో ఉన్న సంగంబండ లోలెవల్ కాల్వ బండ తొలగించడానికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణంకట్టుకున్నదని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మక్తల్-కొడంగల్ పథకంగా మార్చామని, నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో పూర్తి చేసేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారు.
అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే సంగంబండ నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టి కి తీసుకెళ్లగా రూ.12 కోట్ల పరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. మక్తల్లో డిగ్రీ కళాశాల, ఫైర్స్టేషన్లకు సొంత భవనాలు, 133/11 కేవీ సబ్స్టేష న్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ప్రజాప్రతినిధులు, సంగంబండ ముంపు బాధితుల సంఘం అధ్యక్షుడు బాల్రెడ్డి, బీ కేర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.