నాగర్కర్నూల్, డిసెంబర్ 9: జిల్లాలో గతేడాది వానకాలం సీఎంఆర్ రైస్ డెలివరీని ఈనెల 25లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు. 2021-22 వానకాలం కస్టమ్ మిల్లింగ్ రైస్, ఈ ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం రసీదులు నమోదు, ఎఫ్సీఐకి రోజువారి రైస్ పంపిణీ సంబంధిత అంశాలపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లర్లు వేగంగా ఎఫ్సీఐకి రైస్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లులు ప్రతిరోజూ 3వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి చేసి ఎఫ్సీఐకి పంపిణీ చేయాలని సూచించారు.
గత వానకాలం సీజన్కి సంబంధించి 80,479 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు అందించామని, సీఎంఆర్ 60,315 మెట్రిక్ టన్నుల రైస్ అందించారని, ఇంకా 20,164మెట్రిక్ ట న్నుల రైస్ డెలివరీ చేయాల్సి ఉందన్నారు. వీటిని డిసెంబర్ 25వ తేదీలోగా ఎఫ్సీఐకి సీఎంఆర్ పూర్తి చేయాల్సిందిగా రైస్ మిల్లర్లకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వానకాలానికి సంబంధించి 9,400మెట్రిక్ ట న్నుల రైస్ను అందించాలని, ఎఫ్సీఐ ఆదేశించిందని, అందుకు అనుగుణంగా రైస్ మి ల్లర్లు రోజూ 24గంటల మిల్లింగ్ చేసి సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలన్నారు.
ఈ ఏడాది రైతుల నుంచి 49,151 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని మిల్లర్ల ఆధీనం చేసుకున్నప్పటికీ రసీదు అందించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు రూ.10కోట్ల్లు అందడంలో ఆలస్యమవుతుందని, అందుకుకారణమైన మిల్లర్లపై అసహనం వ్యక్తం చేశారు. మీరు చేసే తప్పుకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, మిల్లర్లు ధాన్యం రసీదును అందించాలని ఆదేశించా రు. మిల్లర్లు తమ లారీలను బియ్యం తరలించేందుకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. రైతులకు డబ్బులు అందించే విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జి ల్లా పౌరసరఫరాల అధికారి మోహన్బాబు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బాలరాజు, రైస్మిల్లర్ల అధ్యక్షుడు రమేశ్, నవీన్, హకీం రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.