కొల్లాపూర్, జనవరి 29 : మండలంలోని ఎ ల్లూరు పల్లె దవాఖానలో వైద్య సేవలు, వసతులు, నాణ్యతా ప్రమాణాలను ఢిల్లీకి చెందిన ఎన్క్యూఏఎస్ అస్సెస్మెంట్ టీం ప్రతినిధులు డాక్టర్ ప్రశాం త్ పున్డ్లిక్ గోడం, డాక్టర్ వెన్నెల ఎస్తేర్ ఫెర్నాండేజ్ గోమ్స్ తనిఖీ చేశారు. జిల్లా క్వాలిటీ ఆఫీసర్ సం తోష్, పెంట్లవెల్లి పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్తో క లిసి సోమవారం దవాఖానలోని గదులు, పరిసరా లు, వాటర్ ట్యాంక్, ఓపీ నమోదు కేంద్రం, మరుగుదొడ్డి, సీహెచ్వో, ల్యాబ్ ఏరియా, యోగా ప్రదేశాన్ని పరిశీలించారు.
అనంతరం దవాఖాన పనితీరును ఏఎన్ఎంలు, ఎంపీహెచ్లు, ఆశకార్యకర్తల ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీహెచ్ వో సంపూర్ణమ్మ, ఎంపీహెచ్ఈవో రమేశ్, సూపర్వైజర్ వెంకటమ్మ, హెల్త్ అసిస్టెంట్ ప్రభాకర్, దివాకర్, ఏఎన్ఎం భాగ్యమ్మ, ఎంఎల్హెచ్పీ స్వప్న ఉన్నారు.