కొల్లాపూర్, డిసెంబర్ 24 : నాగర్కర్నూల్ జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. చా లా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. పెద్దకొత్తపల్లి-కొల్లాపూర్ మధ్య ఆదివారం ఉదయం నుంచి 8గంటల వరకు రోడ్లను మంచుదుప్పటి కమ్మేసింది.
దీంతో వాహనాదారులకు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలకు లైట్లు వేసుకొని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా సాయంత్రం నుంచే క్రమేణా చలివణికిస్తున్నది. దీంతో ప్రజలు ఉదయం 9 గంటలు దాటినా బయటికి రావడం లేదు.