మహబూబ్నగర్ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పరుశురాం డీజే షాప్ ను ప్రారంభించి మాట్లాడారు.
దళిత బంధు పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఎవరు చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
దళిత సోదరులంతా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుని తమ ఆర్థిక స్థితిని పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.