దేవరకద్ర, మార్చి 18 : మండలంలోని కోయిల్సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం రైతులు ప్రా జెక్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎనిమిది రోజుల కింద ట కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే, బుధవారం వరకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. రైతులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సోమవారం మధ్యాహ్నమే నిలినివేశారు. దీంతో రైతులు ప్రాజెక్ట్ కార్యాలయానికి చేరుకొని ఈఈ ప్రతాప్సింగ్తో వాగ్వాదానికి దిగారు.
ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో.. మంగళవారం నీటిని విడుదల చేయా లని ఈఈకి సూచించారు. కాగా, ఎమ్మెల్యే వద్ద సరే అని.. రైతులతో వదలమని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఈఈని పట్టుబట్టి బల్సుపల్లికి తీసుకువెళ్లి గ్రామంలో ఎండుతున్న పొలాలు చూపిం చా రు. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం వరకు సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.