వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్
మహబూబ్నగర్, జూలై 8 : రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు 15వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో మాట్లాడారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు రెవెన్యూ అధికార యం త్రాంగం రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసే రెవెన్యూ సదస్సుల సమాచారాన్ని ముందస్తుగానే తెలియజేయాలని సూచించారు. సదస్సుల్లో రైతుల భూసమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.