మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 8 : కోర్టు విధుల్లో ఉన్న డ్యూటీ పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ కే.నర్సింహ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కోర్టు లైసెన్స్ పోలీసు అధికారులు, కోర్టు విధుల్లో ఉన్న అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోకూడదని సూచించారు. అలాగే కోర్టు, వారెంట్స్, సమన్స్, ఎంసీఎస్ వర్టికల్స్ గురించి పోలీసు స్టేషన్ల్లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్స్ తమ విధులో భాగంగా ఎప్పటికప్పుడు కృషి చేయాలన్నారు.
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైందని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే వి ధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలాలను కోర్టు కు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ధ, బా ధ్యత తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు మరింత న మ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూ చించారు.
అనంతరం జిల్లాలోని సీఐలు, ఎస్సైలతో గూ గుల్ మీట్లో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్లో ప్రతి రికార్డులను సీసీటీఎస్ఎస్ (క్రైమ్,క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం)లో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆప్లోడ్ నమో దు చేయాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, వెంకటరమణరెడ్డి, ఎస్పీ సీసీ రామ్రెడ్డి, సీఐ బ షీర్, ఐటీ ఇన్చార్జి ఆర్ఎస్సై రవి, ఎస్సై వరలక్ష్మీ, కోర్టు లైజినింగ్ ఆఫీసర్స్, కోర్టు కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.