రోజురోజుకూ కల్తీ వ్యాపారం పెరుగుతున్నది. జడ్చర్ల కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతున్నది. దొడ్డిదారిలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు ఆహార పదార్థాలతోపాటు వివిధ ఉత్పత్తులు, సరుకులను నకిలీగా మార్చి విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుండ డంతోవిని యోగదారులు అసలేవో.. నకిలీవి ఏవో పోల్చుకోలేక అయోమమయానికి గురవుతున్నారు. ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడమే ఇందుకు నిదర్శనం.. ఇటీవల ఆశీర్వాద్ పైపులు, నకిలీ ప్యారాచూట్ కొబ్బరినూనె డబ్బాలు పట్టుబడ్డాయి. కల్తీ చాయపత్తా, వడ్ల బస్తాలలో కంకరరాళ్లు మిక్సింగ్ చేసి విక్రయించేందుకు యత్నించారు. అధికారులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 12: అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు కల్తీ సరుకుల విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రమైన జడ్చర్లను అడ్డాగా చేసుకొని కొందరు మోసగాళ్లు నకిలీ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జడ్చర్ల పట్టణంలో ఒక్కొక్కటీ నకిలీ వ్యాపారాలు వెలుగుచూస్తుండటంతో అధికారులు సైతం విస్తుపోతున్నారు. కొందరు వ్యాపారులు అక్రమార్జన కోసం వివిధ ఉత్పత్తులు, సరుకులే కాకుండా తినే ఆహార పదార్థాలను సైతం కల్తీ చేసి విక్రయిస్తుండటం గమనార్హం. సాధారణ కంపెనీలతోపాటు బ్రాండెడ్ కంపెనీల పేరిట వస్తువులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తుండడంతో వినియోగదారులు అయోమయంలో పడ్డారు.
ఏది అసలైనది.. ఏది నకిలీదో గుర్తించలేని పరిస్థితి దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు. దీనికితోడుగా తుకాల్లో సైతం మోసం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారస్తులు ఇటీవల జడ్చర్లలో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించారు. జడ్చర్లలో పెద్దఎత్తున వ్యాపారాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు ఇదే అదునుగా చూసుకొని నకిలీ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది.
దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. వ్యాపారకేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నకిలీ వ్యాపారాలను బట్టబయలు చేస్తున్నారు. కల్తీవ్యాపారాలు చేస్తున్న అక్రమార్కులపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. ఏది ఏమైనా నకిలీ వ్యాపారాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పోలీసుశాఖ నకిలీ వ్యాపారాలపై నిఘా పెట్టి చర్యలు చేపడుతు న్నది. కానీ, పూర్తిస్థాయిలో నకిలీ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వెలుగులోకి వచ్చిన వ్యాపారాలు
చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా కల్తీ వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వ్యాపారకేంద్రాలపై తనిఖీలు నిర్వహించి పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. ఎస్పీ ఆదేశాల మేరకు ధాన్యం బస్తాల్లో కంకరరాళ్లు మిక్సింగ్ చేసిన ఘటనపై దాడులు నిర్వహించి పట్టుకున్నాం. పోలీసుశాఖపరంగా అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విక్రయాలపై బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు చేపడుతాం. ఎక్కడైనా నకిలీ వస్తువుల విక్రయాలు, కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
– రమేశ్బాబు, సీఐ, జడ్చర్ల