జడ్చర్ల, మే 25 : పేదల ఆరోగ్యమే లక్ష్యంగా స ర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ద వాఖానలను నిర్మిస్తున్నది. ప్రజలకు స్థా నికంగా మెరుగైన వైద్యం అందించేందుకు జడ్చర్లలో రూ.30 కోట్లతో దాదాపు రెండెకరాల్లో వంద పడకల ఏరి యా దవాఖానను కా ర్పొరేటు స్థాయిలో తీ ర్చిదిద్దారు. ఈ దవాఖానను ఈనెల 27వ తేదీన వైద్య, ఆరోగ్య శా ఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ప్రైవేట్కు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. అత్యవసర సమయా ల్లో పెద్దాసుపత్రులకు చికిత్స కోసం వెళ్లకుండా స్థా నికంగానే వైద్య సేవలందించేందుకు అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంచారు.
ఐసీయూ మొదలుకొని ఎన్నో అధునాతన విభాగాలను ఏ ర్పాటు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. గతం లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వంద పడకల దవాఖానను మంజూరు చేయించా రు. దాదాపు రూ.30 కోట్లతో దవాఖానను నిర్మించారు. ఇందులో అత్యవసర సేవలతోపాటు రెండు ఐసీయూలు, అనెస్తీషియా, సాధారణ వైద్యవిభాగం, ప్రసూతి, గైనకాలజీ, పిల్లలు, జనరల్ సర్జ రీ, ఆర్థోపెడిక్, దంతం, చర్మవ్యాధులకు వైద్యం, డ యాలసిస్, రోగనిర్ధ్దారణ పరీక్షల విభాగం, ట్రామా సర్వీస్, రక్తనిధి, ఎక్స్రే వంటి విభాగాలను ఏర్పా టు చేశారు. అలాగే పది పడకల డయాలసిస్ కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు.
జడ్చర్ల మీదుగా 44, 165వ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నా యి. ఎంతోమంది గాయాల పాలవుతున్నారు. వెం టనే వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్ర స్తుతం జడ్చర్లలో ఉన్న దవాఖాన చిన్నదిగా ఉండడంతో మహబూబ్నగర్కు తరలిస్తున్నారు. ఈ క్ర మంలో జడ్చర్లలో వంద పడకల దవాఖానను ని ర్మించారు. రోగులకు ఇక్కడ అన్ని రకాల వైద్యసేవ లు అందనున్నాయి. నియోజకవర్గ ప్రజలకు అ త్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ని ర్మించిన దవాఖానతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లక్ష్యం నెరవేరనున్నది. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సిబ్బంది, వైద్యపరికరా లు, వసతులు, మందులను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు.
నిరంతర వైద్యసేవలు..
పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడ మే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతర వైద్య సేవలందించేందుకు రూ.30 కోట్లతో వంద పడకల దవాఖానను అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాం. 27న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావాలి.