మహబూబ్నగర్, డిసెంబర్ 22 : ‘ప ల్లె పల్లెనా.. పల్లెర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాటలకు కాలం చె ల్లిందని, నేడు సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాలమూరు అద్భుతంగా ఆవిష్కృతమైందని ఆర్థిక, వైద్యారోగ్య శా ఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశా రు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలంలో రూ.300 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సూపర్స్పెషాలిటీ దవాఖానకు గురువారం మంత్రి హరీశ్రావు భూమిపూజ చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎం పీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హ రీశ్రావు మాట్లాడారు.
ఉ మ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో మూడు మెడికల్ క ళాశాలలు ఉన్నాయని.., ఒకే జిల్లాలో ఇన్ని కాలేజీలు ఉండ డం దేశంలో పాలమూరుకే ద క్కిందన్నారు. పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్కు ఎం తో ప్రేమ ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో మొదటి మెడికల్ కళాశాలను మహబూబ్నగర్కు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి కళాశాలలో 26 పీజీ సీట్లు ప్రా రంభించుకుందామన్నారు. పారామెడికల్లో ఆరు కోర్సులను ఏర్పాటు చేద్దామన్నారు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేశామన్నారు. పాలమూరులో సూపర్స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైద్యశాఖలో 969 ఖాళీలను భర్తీ చేశామని, రెండుమూడు రోజుల్లో విధులో చేరుతారన్నారు. మరో 1,123 మంది డాక్టర్లను నియమించేందుకు అవసరమైన ప్రక్రియ జరుగుతుందన్నారు.
ప్రజలకు మంచి చేయడంలో విఫలం..
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో పూ ర్తిగా విఫలమైందని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. మొన్న కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ గద్వాల దవాఖానను సందర్శించి చిన్న చిన్న సమస్యలను లేవనెత్తారన్నారు. పేదలకు మంచిగా వైద్యసేవలందుతున్నందునే దే శంలో తెలంగాణకు మూడో స్థానం లభించిందన్నారు. మంత్రి మహేంద్రనాథ్ సొంత రాష్ట్రం 28వ స్థానంలో నిలిచిందన్నారు. ఒకవైపు మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్రం మెచ్చుకుం టూ కాపీ కొడుతున్నదన్నారు. మరోవైపు రాష్ట్రంలో పథకాలు బాగాలేవని వేలెత్తి చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం 157 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని, కానీ తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకే దే శం.. ఒకే విధానం అంటూనే రాష్ర్టాన్ని చిన్నచూపు చూ స్తుందని విమర్శించారు. దేశంలో ఎంబీబీఎస్ సీట్లలో 71 శాతం, పీజీలో 68 శాతం సీట్లు పెరగగా, రాష్ట్రంలో ఎంబీబీఎస్లో 127 శాతం, పీజీలో 112 శాతం సీట్లు పెంచినట్లు తెలిపారు. 70 ఏండ్లల్లో కేవలం మూడు మెడికల్ క ళాశాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే.. కేంద్ర సహకారం లేకపోయినా తెలంగాణ వచ్చాక కేవలం ఏడేండ్లలోనే 12 కా లేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, దామోదర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎ ర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్ ఇసాక్, డీసీసీబీ చైర్మన్ ని జాంపాషా, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చై ర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ పాల్గొన్నారు.