మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 7 : తెలంగాణలో శాంతిభద్రతలు బాగుండ డం వల్లే ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో నేరాలు కట్టడి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర పోలీసు దేశాని కి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పో లీస్ పరేడ్ మైదానంలో నూతనంగా నిర్మించిన పోర్ట్ వాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ మాదిరిగానే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. పోలీసు పాసింగ్ ఔట్ పరేడ్తోపాటు, గణతంత్ర దినోత్సవం, పంద్రాగస్టు కార్యక్రమాల నిర్వహణ సందర్భంలో పోర్ట్వాల్ అవసరం ఎంతో ఉంటుందన్నారు. అందుకే శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్లు పేర్కొన్నారు.
నేరాలు అదుపులో ఉన్నాయని, పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ ఇతర రాష్ర్టాల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారని తెలిపారు. దీంతో ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అలాగే పాలమూరులోనూ శాంతిభద్రతలు బాగున్నాయని తెలిపారు. పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రభుత్వానికి రెండు కండ్లలాంటివన్నారు. ఎస్పీ, కలెక్టర్లు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో హోంగార్డులకూ జీతభత్యాలను అందజేస్తున్నామని వివరించారు. పోలీసులకు రిస్క్ అలవెన్సులు ఎక్కువ మొత్తంలో ఇచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. అనంతరం పరేడ్ మైదానంలో మొ క్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్, పీపీ బెక్కెం జనార్దన్, విక్రమ్దేవ్, వెంకట్రాములు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాబురావు, మురళి, మెనూశ్రీ, రాంబక్ష, పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.