మహబూబ్నగర్ : మహబూబ్నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్ పట్టణ పరిధిలో ఎస్వీఎస్, ఏనుకొండ తదితర ప్రాంతాలలో చేపట్టిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
మాచన్ పల్లిలో చేపట్టిన నిర్మాణాలు కూడా తొందరగా పూర్తి చేయాలని, మాచన్ పల్లి, మాచన్ పల్లి తండా ఇండ్లను ఒకే సారి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోడూర్ గ్రామంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను సైతం వేగవంతం చేయాలన్నారు. కోడూరులో నిర్మిస్తున్న ఇండ్ల క్యూరింగ్కు నీరు కావాలని సంబంధిత ఏఈ, ఏజెన్సీలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఓబులాయ పల్లి, అల్లిపూర్ తదితర గ్రామాలు ని, హన్వాడ మండలంలో వివిధ గ్రామాల్లో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలపై కూడా సమీక్షించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైద్యం భాస్కర్, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.